తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2019, 12:45 PM IST

ETV Bharat / sports

షెఫాలి, దీప్తి విజృంభణ.. విండీస్​పై భారత్ ఘనవిజయం

భారత మహిళా ఓపెనర్ షెఫాలి వర్మ మరోసారి అర్ధశతకంతో ఆకట్టుకుంది. ఫలితంగా విండీస్ మహిళా జట్టుతో జరిగిన రెండో టీ20లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ దీప్తి శర్మ (4/10) చక్కటి ప్రదర్శనతో కరీబియన్ అమ్మాయిలు 7 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేయగలిగారు.

భారత్ - విండీస్​

వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్​లో మరోసారి విజృంభించింది భారత మహిళా జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ(69). సెయింట్ లూసియా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆమె అర్ధశతకంతో ఆకట్టుకోగా. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 30 పరుగులతో నిలకడగా ఆడింది. ఫలితంగా టీమిండియా అమ్మాయిలు 10 వికెట్ల తేడాతో గెలిచారు. 5 టీ20ల సిరీస్​లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లారు.

మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేసింది. కరీబియన్​ జట్టులో చెడీన్ నేషన్(32) మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

దీప్తి శర్మ

104 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన టీమిండియాలో ఓపెనర్లు అదరగొట్టారు. వికెట్ కోల్పోకుండా.. 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా షెఫాలి వర్మ 35 బంతుల్లో 69 పరుగులతో మరోసారి విధ్వంసం సృష్టించింది. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. శనివారం జరిగిన తొలి టీ20లో 73 పరుగులతో ఆకట్టుకున్న ఈ 15ఏళ్ల యువ క్రీడాకారిణి రెండో మ్యాచ్​లోనూ అదే రీతిలో ఆకట్టుకుంది. స్టార్ ఓపెనర్ స్మృతి 30 పరుగులు చేసి షెఫాలీకి సహకరించింది.

ఇదీ చదవండి: కష్టానికి తగిన ఫలితం దక్కింది: చాహర్

ABOUT THE AUTHOR

...view details