తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ జోక్యంతో షమీకి లైన్ క్లియర్ - US EMBASSY

అమెరికా వీసా పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న బౌలర్ షమీకి బీసీసీఐ సీఈఓ జోక్యంతో మార్గం సుగమమైంది.

బీసీసీఐ జోక్యంతో షమికి లైన్ క్లియర్

By

Published : Jul 27, 2019, 2:31 PM IST

అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన టీమిండియా బౌలర్ మహ్మద్​​ షమీకి యూఎస్ ఎంబసీ షాక్ ఇచ్చింది. అతడిపై స్వదేశంలో గృహహింస కేసు ఇంకా విచారణలో ఉన్న కారణంగా వీసాను నిరాకరించింది. చివరకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి జోక్యంతో అతడికి అనుమతి లభించింది.

షమి.. దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని, అతడిపై ఉన్న కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని లేఖలో రాసి ఎంబసీ మందుంచారు రాహుల్.

టీమిండియా బౌలర్​ మహ్మద్​ షమి

"అవును, షమి వీసాను యూఎస్ ఎంబసీ తొలుత నిరాకరించింది. అతడిపై ఉన్న పోలీసు​ కేసు ఇంకా విచారణలో ఉండటమే కారణం. షమి దేశం తరఫున క్రికెట్​లో సాధించిన ఘనతల్ని ఓ లేఖలో రాసి ఎంబసీ ముందుంచారు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం వారికిచ్చారు." -బీసీసీఐ అధికారి.

2018 సంవత్సరంలో షమి భార్య జహాన్.. తనను వేధిస్తున్నాడని అతడిపై ఆరోపణలు చేస్తూ కోల్​కతాలో కేసు పెట్టింది. ప్రస్తుతం ఇది ఇంకా విచారణలో ఉంది.

ఇది చదవండి: ప్రపంచకప్​లో అఫ్గానిస్థాన్​పై హాట్రిక్​ సాధించిన మహ్మద్​ షమి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details