తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంక ఆటగాళ్ల భయానికి కారణం ఐపీఎల్​: అఫ్రిదీ - Shahid Afridi blames IPL

పాకిస్థాన్​లో శ్రీలంక ఆటగాళ్లు పర్యటించకపోవడానికి కారణం ఐపీఎల్​ ఫ్రాంఛైజీలు అంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. లంక ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయని తెలిపాడు.

అఫ్రి దీ

By

Published : Sep 20, 2019, 3:16 PM IST

Updated : Oct 1, 2019, 8:17 AM IST

శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్​ పర్యటనకు రావడానికి వెనుకడుగు వేస్తున్నాయి. అందుకు కారణం ఐపీఎల్​ అని అంటున్నాడు పాక్ మాజీ ఆటగాడు అఫ్రిదీ. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు లంక ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని అన్నాడు.

"శ్రీలంక ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ ఆడటానికి లంక ఆటగాళ్లతో మాట్లాడినపుడు వారు ఇదే విషయం చెప్పారు. పీఎస్​ఎల్​లో ఆడటానికి మీరు పాక్ వెళితే మీకు కాంట్రాక్ట్ దక్కదు అని ఫ్రాంఛైజీలు ఆటగాళ్లకు చెబుతున్నాయి.''

-షాహిద్ అఫ్రిదీ, పాక్ మాజీ ఆటగాడు

అఫ్రిదీ ట్వీట్

పాక్​ పర్యటనకు దూరంగా ఉన్న క్రికెటర్లలో లంక జట్టు వన్డే, టీ20 కెప్టెన్ మలింగ, దిముత్ కరుణరత్నేతో పాటు తిసార పెరీరా, మాథ్యూస్, నీరోషాన్ డిక్​వెలా, కుషాల్ పెరీరా, ధనంజయ డిసిల్వా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చండీమల్ ఉన్నారు. కానీ ఇందులో ఐపీఎల్ కాంట్రాక్ట్ ఉంది కేవలం మలింగకు మాత్రమే. అఖిల ధనంజయను 2018లో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసినా చివరి సీజన్​లో వదులుకుంది. ఈ కారణంగా అఫ్రిదీ చెప్పిన ఈ మాటలు నమ్మశక్యంగా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

"పాకిస్థాన్ ఎల్లపుడూ శ్రీలంకకు మద్దతు తెలుపుతుంది. లంక పర్యటనకు మేము ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు. పాక్​లో పర్యటించేలా లంక క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్ ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీలంక ఆటగాళ్లు ఎవరైతే పాక గడ్డపై మ్యాచ్​ ఆడతారో వారు పాకిస్థాన్ చరిత్రలో నిలిచిపోతారు."

-షాహిద్ అఫ్రిదీ, పాక్ మాజీ ఆటగాడు

అఫ్రిదీ ట్వీట్

షెడ్యూల్ ప్రకారం శ్రీలంక జట్టు సెప్టెంబర్​ 27 నుంచి అక్టోబర్ 9 వరకుపాక్​తో మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్​ ఆడాలి.

ఇవీ చూడండి.. హార్దిక్ పాండ్య.. లోకల్ టు నేషనల్

Last Updated : Oct 1, 2019, 8:17 AM IST

ABOUT THE AUTHOR

...view details