తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 10:04 AM IST

ETV Bharat / sports

సచిన్​ స్ఫూర్తితో లేడీ మాస్టర్​గా ఎదిగిన షెఫాలీ

చిన్న వయసులోనే అసమాన ప్రతిభతో ఆకట్టుకుంటోంది భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ. ఆమె తల్లిదండ్రులతో 'ఈటీవీ భారత్' ముచ్చటించింది. సచిన్​ తెందూల్కర్​ను అభిమానిస్తూ.. క్రికెట్ పట్ల షెఫాలీ ఆసక్తి పెంచుకుందని, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో రికార్డులు అందుకుంటుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

సచిన్​ను చూస్తూ లేడీ మాస్టర్​గా ఎదిగిన షెఫాలి

సచిన్​ను చూస్తూ లేడీ మాస్టర్​గా ఎదిగిన షెఫాలి

15 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. స్కూల్లో స్నేహితులతో సరదాగా గడుపుతూ.. చదువుల్లో మునిగితేలుతుంటారు. కానీ టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ మాత్రం అంతర్జాతీయ క్రికెట్​లో రికార్డులు సృష్టిస్తోంది.

ఇటీవల వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో రికార్డు అర్ధశతకం సాధించిన షెఫాలీ తల్లిదండ్రులతో 'ఈటీవీ భారత్'​ ముచ్చటించింది. ఆమెకు సంబంధించిన విశేషాలను తెలుసుకుంది.

అతితక్కువ వయసులో అర్ధశతకం చేసిన భారత క్రికెటర్​గా నిలిచింది షెఫాలీ వర్మ. 30 ఏళ్లుగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఘనత సాధించడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

హరియాణాలోని రోహతక్​లో పుట్టిన షెఫాలీ.. సచిన్​ను చూస్తూ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అతడి ఆటంటే ఆమెకు ఎంతో ఇష్టమని తల్లి పర్వీన్ బాలా చెప్పారు.

మాస్టర్​ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్​లో ఓనమాలు దిద్దిన షెఫాలీ.. ఇప్పుడు అంతర్జాతీయ రికార్డులు అందుకోవడం గర్వంగా ఉందని తండ్రి సంజీవ్ అన్నారు. ఇలాంటి మరెన్నో ఘనతలు అందుకుంటుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో 43 బంతుల్లో 79 పరుగులు చేసి షెఫాలీ.. 30 ఏళ్లుగా ఉన్న సచిన్ రికార్డును అధిగమించింది. రెండో టీ20లోనూ 35 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఫలితంగా ఐదు మ్యాచ్​ల సిరీస్​లో.. ప్రస్తుతం 2-0 తేడాతో ముందంజలో ఉంది భారత్.

స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్​తో టీ20ల్లోకి వచ్చింది షెఫాలీ. ప్రస్తుతం ఆమె స్థానంలో ఆడుతోంది. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​తో అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం చేసింది.

ఇదీ చదవండి: ప్రపంచ పారా అథ్లెట్​ ఛాంపియన్​షిప్​లో భారత్​కు స్వర్ణం

ABOUT THE AUTHOR

...view details