వరల్డ్కప్ ఓటమి తర్వాత బీసీసీఐ పాలక మండలి జులై 19న తొలిసారిగా సమావేశం కానుంది. ప్రపంచకప్లో టీమిండియా ఆటతీరుపై సమీక్షతో పాటు విండీస్తో సిరీస్కు ఆటగాళ్లనూ ప్రకటించనున్నారు.
ప్రపంచకప్ సెమీస్లోనే వైదొలిగిన టీమిండియా తదుపరి సిరీస్లపై దృష్టి సారించింది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్తో జరిగే సిరీస్ కోసం జట్టును ప్రకటించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ధోనీ కెరీర్పైనా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రపంచకప్లో ధోనీ ప్రదర్శనపై విమర్శలు వస్తున్న తరుణంలో వెస్టిండీస్తో జరగబోయే సిరీస్లో ఆడతాడా లేదా అనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న వార్తలూ వినిపిస్తున్నాయి.