తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇమ్రాన్​కు అదిరిపోయే పంచ్​ ఇచ్చిన సెహ్వాగ్​

పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​పై ట్విట్టర్​ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. తనని తాను అవమానించుకునేలా మాట్లాడుతున్నారని ట్వీట్ చేశాడు.

By

Published : Oct 4, 2019, 10:45 AM IST

వీరేంద్ర సెహ్వాగ్-ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్,​ తనను తాను అవమానించుకునేందుకు కొత్త మార్గాలు కనుగొంటున్నారన్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. అమెరికాకు చెందిన ఓ వార్తా ఛానెల్‌లో ఇమ్రాన్‌ మాట్లాడిన వీడియోను ట్విట్టర్​లో పోస్ట్‌ చేస్తూ, ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్​ ఇచ్చాడు. ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్‌ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేస్తూ, శాంతి కోరుకోవాల్సిన దేశమే ఇలాంటి అనవసరపు రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నించాడీ మాజీ క్రికెటర్. సెహ్వాగ్​ వ్యాఖ్యలకు గంగూలీ మద్దతు పలికాడు.

గత నెల 26న జరిగిన ఐరాస సాధారణ సభ 74వ సమావేశాల్లో ఆర్టికల్‌ 370 రద్దును ప్రస్తావించిన ఇమ్రాన్‌.. ఓ అంతర్జాతీయ వేదికపై రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశం ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయంటూ హెచ్చరించే యత్నం చేశారు.

ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యలపై.. క్రికెటర్లు మహ్మద్‌ షమీ, హర్భజన్‌ సింగ్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఆయన మాట్లాడుతున్నారని, ఇటువంటివి తగవని హితవు పలికారు.

ఇది చదవండి: ఎన్​బీఏ టోర్నీలో.. నీతా అంబానీకి అరుదైన గౌరవం

ABOUT THE AUTHOR

...view details