తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2020, 11:44 AM IST

ETV Bharat / sports

'ఐపీఎల్ వాయిదా'పై సత్వర విచారణకు సుప్రీం నో

ఐపీఎల్​ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్చి 16న మరో ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించాలని సూచించింది.

ఐపీఎల్​పై పిటిషన్​ను​ తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఐపీఎల్ 2020

ఐపీఎల్​ 13వ సీజన్​ను సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్​ను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. అయితే ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణకు న్యాయస్థానం నిరాకరించింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు. అయినా ఐపీఎల్​పై వ్యాజ్యం వేశారు న్యాయవాది మోహన్​ బాబు అగర్వాల్. సత్వర విచారణ జరపాలని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అనిరుద్ధ బోస్​తో కూడిన వెకేషన్​ బెంచ్​ను కోరారు. ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. సెలవులు ముగిశాక మార్చి 16న ఐపీఎల్​ వ్యవహారాన్ని రెగులర్ బెంచ్​ ముందు ప్రస్తావించాలని సూచించింది.

అనుమానాలే...

మహారాష్ట్ర, కర్ణాటక క్రికెట్​ సంఘాలు ఐపీఎల్​ మ్యాచ్​లకు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ప్రస్తుతం నిలిపేశాయి. దీంతో ఈ సీజన్​ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం(మార్చి 14).. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. కరోనా ప్రభావం గురించి చర్చించి, అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఐపీఎల్ మ్యాచ్​లోని ఓ దృశ్యం

షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 13వ సీజన్​.. ఈ నెల 29 నుంచి మొదలవ్వాలి. తొలి మ్యాచ్​ వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్​ కింగ్స్ మధ్య జరగాలి. అయితే ప్రస్తుత పరిస్థితులు టోర్నీ నిర్వహణపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details