తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్ కెప్టెన్​ సర్ఫరాజ్​ అహ్మద్​కు ఉద్వాసన

పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్​లుగా అజహర్ అలీ, బాబర్​ అజమ్​లను నియమిస్తూ, ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

పాక్ కెప్టెన్​ సర్ఫరాజ్​ అహ్మద్​కు ఉద్వాసన

By

Published : Oct 18, 2019, 2:08 PM IST

గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైఫల్యాలు ఎదుర్కొంటోంది. ఇటీవలే స్వదేశంలో శ్రీలంక చేతిలో టీ20 సిరీస్​ ఓడిపోయింది. అందుకే పగ్గాలు మార్చాలని నిర్ణయించుకుంది మేనేజ్​మెంట్. ప్రస్తుతం టెస్టు, టీ20లకుసారథ్యం వహిస్తోన్న సర్ఫరాజ్​కు ఉద్వాసన పలికింది. టెస్టులకు అజహర్ అలీ, టీ20లకు బాబర్ అజమ్​ను సారథిగా నియమిస్తూ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

గత రెండేళ్ల నుంచి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్​గా ఉన్నాడు సర్ఫరాజ్. 2017 ఛాంపియన్స్ ట్రోఫీని ఇతడి సారథ్యంలోనే గెల్చుకుంది పాక్.

పాక్ టీ20 కెప్టెన్ బాబార్ అజమ్
టెస్టు కెప్టెన్ అజహర్ అలీ

ఇది చదవండి: పాక్​​ సారథి సర్ఫ్​రాజ్​ ఆవలింతలు... నెట్టింట ట్రోల్​

ABOUT THE AUTHOR

...view details