తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాయుడు, చావ్లాపై మంజ్రేకర్​ వివాదాస్పద వ్యాఖ్యలు

వ్యాఖ్యాత సంజయ్​ మంజ్రేకర్​ సీఎస్కే ఆటగాళ్లు​ చావ్లా, రాయుడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. దీంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్​ చేస్తున్నారు.

By

Published : Sep 20, 2020, 6:30 PM IST

Sanjay Manjrekar
సంజయ్​ మంజ్రేకర్​

ప్రముఖ కామెంటేటర్ సంజయ్​ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు.​ గతేడాది ప్రపంచకప్​ సందర్భంగా టీమ్ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పుడే అతడిపై చాలా ట్రోల్స్​ వచ్చాయి. ఇప్పుడు ఐపీఎల్​ ప్రారంభమైన నేపథ్యంలో చెన్నై క్రికెటర్లు పియూష్​ చావ్లా, అంబటి రాయుడులను తక్కువ ప్రొఫైల్​ ఉన్న వాళ్లని ట్వీట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఎస్కే అభిమానులు.. సంజయ్​పై విమర్శలు తీవ్రం చేశారు. చావ్లా రెండు ప్రపంచకప్​ జట్లలో భాగమవగా.. రాయుడు టీమ్​ఇండియా తరఫున 55 వన్డేలు ఆడాడు.

ఈ ఏడాది మార్చిలో, వ్యాఖ్యత ప్యానెల్​ నుంచి మంజ్రేకర్​ను బీసీసీఐ తొలగించింది. ఈ ఏడాది ఐపీఎల్​ కోసం తనను కామెంటేటర్​గా నియమించమని కోరుతూ బోర్డుకు లేఖ రాశాడు. కానీ అతడికి అంగీకారం తెలపలేదు. దీంతో లీగ్​లో భాగం కాలేకపోయారు.

ABOUT THE AUTHOR

...view details