వన్డే క్రికెట్ అనగానే బంతికో పరుగు చొప్పున చేస్తే చాలన్నట్లుగా ఉండేది. కానీ చాలాకాలం క్రితమే దీనిని చెరిపేశాడు శ్రీలంక బ్యాట్స్మెన్ సనత్ జయసూర్య. బంతికో పరుగు కాదు, రెండు పరుగులు రాబట్టి... వన్డేల్లోని బ్యాటింగ్లో మార్పునకు ఓ విధంగా కారణమయ్యాడు. అలాంటి విధ్వంసక ఇన్నింగ్స్కు నేటికి సరిగ్గా 24 ఏళ్లు.
1996 ఏప్రిల్ 2న పాకిస్థాన్తో సింగర్ కప్ ఆడింది శ్రీలంక. సింగపూర్లో జరిగిన తొలి మ్యాచ్లో వీరవిహారం చేసిన జయసూర్య.. 48 బంతుల్లోనే శతకం చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 11 సిక్స్లు ఉన్నాయి. మొత్తంగా 65 బంతుల్లో 134 పరుగులు చేసి, జట్టు స్కోరు 349/9 చేయడంలో కీలక పాత్ర పోషించాడు.