ఒకానొక దశలో బాగా పాపులర్ అయిన.. భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్ రూపాన్ని పోలి ఉన్న వ్యక్తి బల్వీర్ చాంద్ గుర్తున్నాడా? ప్రస్తుతం ఇతడు మరోసారి తెరపైకి వచ్చాడు. తాజాగా ఈ లాక్డౌన్తో తన జీవనోపాధి కోల్పోయాని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతే కాకుండా అతనితో పాటు తన కుటంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందని బాధపడ్డాడు.
"లాక్డౌన్ కారణంగా నేను పని చేసే 'గోలి వడాపావ్ నెం.1' సంస్థకు ఆర్థిక నష్టం కలిగింది. దాంతో చాలా మంది సిబ్బందిని తొలిగించింది ఆ సంస్థ. అందులో నేను ఒకడిని. పరిస్థితులు మెరుగైన తర్వాత తిరిగి చేర్చుకుంటామన్నారు."
-బల్వీర్ చాంద్, సచిన్ పోలిన వ్యక్తి.
దీంతో పాటు తాను మొదటి సారి సచిన్ను కలిసిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు బల్వీర్.