తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ రాస్ టేలర్ - cricket news

పొట్టి ఫార్మాట్​లో 100 మ్యాచ్​లాడిన తొలి కివీస్​ క్రికెటర్​గా నిలిచాడు రాస్ టేలర్. భారత్​తో జరుగుతున్న ఐదో టీ20లో పాల్గొని ఈ ఘనత సాధించాడు.

ross taylor became third cricketer completed 100 T20I matches
కివీస్ బ్యాట్స్​మన్ రాస్ టేలర్

By

Published : Feb 2, 2020, 1:34 PM IST

Updated : Feb 28, 2020, 9:28 PM IST

భారత్​తో ఐదో టీ20 ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాట్స్​మన్ రాస్ టేలర్ మరో ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్​లో 100 మ్యాచ్​లాడిన మూడో క్రికెటర్​గా నిలిచాడు. తమ దేశం తరఫున ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.

టీ20ల్లో అత్యధిక మ్యాచ్​లాడిన క్రికెటర్​ పాకిస్థాన్​కు చెందిన షోయబ్ మాలిక్(113). రెండో స్థానంలో టీమిండియా స్టార్ బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ(107) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్థానం సొంతం చేసుకున్నాడు రాస్ టేలర్. అఫ్రిది(99), ధోనీ(98).. నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

Last Updated : Feb 28, 2020, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details