ఈ ఏడాది టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కరోనా కారణంగా రెండు టోర్నీల్లో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రోహిత్. లాక్డౌన్ వేళ అభిమానులను ఇన్స్టాగ్రామ్ వేదికగా పలకరించిన రోహిత్.. ఈ ఏడాది ఏ టోర్నీకి ప్రాధాన్యత ఇస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా.. రెండింట్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు.
రెండు టోర్నీలపై రోహిత్ ఆసక్తి.. అవేంటంటే? - cricket news latest news
లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ రెండింట్లో ఏ టోర్నీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారన్న అభిమానుల ప్రశ్నకు.. రెండింట్లోనూ అడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.
![రెండు టోర్నీలపై రోహిత్ ఆసక్తి.. అవేంటంటే? Rohit wants to play both T20 World Cup and IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7614635-104-7614635-1592136544134.jpg)
ఆ రెండు టోర్నీలూ ఆడేందుకు రోహిత్ ఆసక్తి
అస్ట్రేలియాలో అక్టోబరు-నవంబరులో జరగాల్సిన ప్రపంచకప్పై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, బీసీసీఐ ఐపీఎల్ను నిరవధిక వాయిదా వేసింది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదా వేస్తే ఐపీఎల్ను నిర్వహించే సూచనలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్లో రోహిత్ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ ఇప్పటికే నాలుగుసార్లు ఛాపింయన్గా నిలిచింది.