ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్ రోహిత్ శర్మనే అని అన్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అతడు రిటైర్మెంట్ తీసుకునేలోపు మరో మూడు ట్రోఫీలు సులభంగా గెలుస్తాడని అభిప్రాయపడ్డాడు.
"ఎన్నోసార్లు విజేతగా నిలిచామన్న విషయంపైనే కెప్టెన్సీ ఆధాపడి ఉంటుంది. ఇది రోహిత్కు సరిగ్గా సరిపోతుంది. ముంబయి తరఫున సారథిగా నాలుగుసార్లు కప్పు అందుకున్నాడు"
-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబయి ఇండియన్స్ విజయవంతమైన ఫ్రాంఛైజీల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. 2013లోఈ జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్.. ఆ ఏడాదితో పాటు 2015, 2017, 2019లలో కప్పు తెచ్చిపెట్టాడు.
సారథిగా రోహిత్.. 104 మ్యాచుల్లో 60 గెలిచాడు. 58.65 శాతం విజయాల రేటు నమోదు చేశాడు. ఇది చూస్తుంటే అతడు కెరీర్ ముగిసేలోపు మొత్తంగా 6-7 ట్రోఫీలు సొంతం చేసుకుంటాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి : ఐపీఎల్ ఆల్టైమ్ అత్యుత్తమ సారథులు వీరే