స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ రాకతో ఆస్ట్రేలియా జట్టు బలంగా మారిందని అన్నాడు భారత క్రికెటర్ రోహిత్ శర్మ. కంగారూ గడ్డపై ఈ ఏడాది చివర్లో జరగనున్న టెస్టు సిరీస్ ప్రత్యేకంగా ఉండనుందని అభిప్రాయపడ్డాడు. దానికోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
'న్యూజిలాండ్ సిరీస్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ గాయం కారణంగా అక్కడ టెస్టులు ఆడలేకపోయాను. అందుకే ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కంగారూ గడ్డపై వార్నర్, స్మిత్ ఉండగా ఆడటం నిజంగా ప్రత్యేకంగా ఉండనుంది. వారి రాకతో ఆసీస్ జట్టు బలంగా మారింది. అదేవిధంగా టెస్టు ఓపెనర్గా ఆటను ఆస్వాదిస్తున్నా' -రోహిత్ శర్మ, భారత క్రికెటర్