టీమ్ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్కు పంపించారు. మెల్బోర్న్లోని ఓ హోటల్లో కలిసి భోజనం చేయడం వల్ల ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వారు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో అనే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
నూతన సంవత్సరం సందర్భంగా రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, పృథ్వీషా, నవదీప్ సైని మెల్బోర్న్లోని ఓ హోటల్కు వెళ్లి భోజనం చేశారు. అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వీరి చిత్రాలు, వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. వారి బిల్లు కట్టడమే కాకుండా పంత్ను కౌగిలించుకున్నానని వ్యాఖ్యానించాడు. ఇది వివాదాస్పదం కావడం వల్ల ఆ అభిమాని క్షమాపణలు కోరాడు. తన డబ్బులను రోహిత్ శర్మ చెల్లించాడని తెలిపాడు.