తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెహ్వాగ్ అర్ధశతకం.. ఇండియా లెజెండ్స్ విజయం - Road Safety World Series : India legends Beat Westindies Legends

రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా వెస్టిండీస్​ లెజెండ్స్​తో జరిగిన మొదటి టీ20లో ఇండియా లెజెండ్స్ ఘనవిజయం సాధించింది. సెహ్వాగ్ అర్ధశతకంతో రాణించాడు.

సచిన్
సచిన్

By

Published : Mar 7, 2020, 10:54 PM IST

Updated : Mar 8, 2020, 5:29 AM IST

రోడ్డు భద్రతా అవగాహన (రోడ్ సేఫ్టీ అవేర్​నెస్) కార్యక్రమంలో భాగంగా ముంబయిలో జరిగిన టీ20 ఎగ్జిబిషన్​ టోర్నీ మొదటి మ్యాచ్​లో ఇండియా లెజెండ్స్ -వెస్టిండీస్ లెజెండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ తెందుల్కర్‌, బ్రియన్‌ లారా, వీరేంద్ర సెహ్వాగ్‌ తదితరులు మరోసారి బ్యాట్ పట్టి, మైదానంలో సందడి చేశారు.

వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. చంద్రపాల్ (61) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. డారెన్ గంగా (32) ఫర్వాలేదనిపించాడు. దిగ్గజ ఆటగాడు లారా (17) తక్కువ పరుగులకే పరిమితమయ్యాడు.

అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెంండ్స్​ జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇన్నింగ్స్​ మొదటి బంతికే ఫోర్ బాది మరోసారి వింటేజ్ సెహ్వాగ్​ను గుర్తుకుతెచ్చాడు వీరు. అభిమానులకు కనువిందు చేస్తూ ఓపెనర్లుగా దిగిన సెహ్వాగ్, సచిన్ మొదటి వికెట్​కు 83 పరుగులు జోడించారు. అనంతరం సచిన్ 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కానీ సెహ్వాగ్ మాత్రం అర్ధసెంచరీతో (74) నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా ఇండియా లెజెండ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Last Updated : Mar 8, 2020, 5:29 AM IST

ABOUT THE AUTHOR

...view details