మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరుకు అభిమాన దళం ఎక్కువ. అయితే గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత మళ్లీ జట్టులో కనిపించలేదు మహీ. ఫలితంగా అతడి రిటైర్మెంట్పై ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. దీనిపై ధోనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అప్పుడే కొందరు భారత జట్టులో భవిష్యత్ ధోనీ అంటూ కొందరి పేర్లు ప్రకటిస్తున్నారు. అందులో ఇప్పటికే ఎక్కువగా వినపడిన పేరు రిషభ్ పంత్. ధోనీ తర్వాత జట్టులోకి వచ్చినా అనుకున్న స్థాయి ప్రదర్శన చేయలేక చోటు కోల్పోయాడు. కాగా ప్రస్తుతం ధోనీ వారుసుడిగా ఇంకో పేరు వినిపిస్తోంది.
రియాన్ పరాగ్.. గతేడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడిన కుర్రాడు. ఈ యువ ఆటగాడి ఆట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్లో అతిపిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్ల్లో 127 స్ట్రైక్ రేట్తో 160 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇతడినే ధోనీ భవిష్యత్ వారసుడంటూ చెబుతున్నాడు సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.