తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ వారసుడు ఇతడే అంటున్న ఉతప్ప - ఉతప్ప తాజా వార్తలు

మహేంద్ర సింగ్ ధోనీ వారసుడంటూ ఇప్పటికే రిషభ్ పంత్ పేరు వినిపించింది. కానీ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక జట్టుకు దూరమయ్యాడు పంత్. కానీ ఇప్పుడు భవిష్యత్​ ధోనీ అంటూ మరో యువ ఆటగాడి పేరు వినిపిస్తోంది.

ధోనీ
ధోనీ

By

Published : May 29, 2020, 8:42 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరుకు అభిమాన దళం ఎక్కువ. అయితే గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత మళ్లీ జట్టులో కనిపించలేదు మహీ. ఫలితంగా అతడి రిటైర్మెంట్​పై ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. దీనిపై ధోనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అప్పుడే కొందరు భారత జట్టులో భవిష్యత్​ ధోనీ అంటూ కొందరి పేర్లు ప్రకటిస్తున్నారు. అందులో ఇప్పటికే ఎక్కువగా వినపడిన పేరు రిషభ్ పంత్. ధోనీ తర్వాత జట్టులోకి వచ్చినా అనుకున్న స్థాయి ప్రదర్శన చేయలేక చోటు కోల్పోయాడు. కాగా ప్రస్తుతం ధోనీ వారుసుడిగా ఇంకో పేరు వినిపిస్తోంది.

రియాన్ పరాగ్.. గతేడాది ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్​కు ఆడిన కుర్రాడు. ఈ యువ ఆటగాడి ఆట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్​లో అతిపిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్​ల్లో 127 స్ట్రైక్ రేట్​తో 160 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇతడినే ధోనీ భవిష్యత్ వారసుడంటూ చెబుతున్నాడు సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.

రియాన్ పరాగ్

"రియాన్ పరాగ్ భవిష్యత్​పై చాలా ఆసక్తిగా ఉన్నా. ఇతడు భారత జట్టుకు దీర్ఘకాలం సేవలందిస్తాడని అనుకుంటున్నా. మరో ధోనీ లేడా అనే ప్రశ్నకు ఇతడే సమాధానం."

-రాబిన్ ఉతప్ప, టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్

18 ఏళ్ల పరాగ్ 2018 అండర్​-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇప్పటికే ఇతడిపై మరో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా ప్రశంసలు కురిపించాడు. నెట్స్​లో రియాన్ ప్రాక్టీస్​ను గమనించానని.. అతడికి మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details