తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాజస్థాన్​ రాయల్స్ డైరెక్టర్​గా సంగక్కర

జట్టును ప్రక్షాళన దిశగా భారీ మార్పులు చేస్తోంది రాజస్థాన్ రాయల్స్​. ఇటీవల కెప్టెన్​గా స్టీవ్​స్మిత్​ను తొలగించి యువ క్రికెటర్ సంజూ శాంసన్​కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక జట్టులో క్రికెట్​ వ్యవస్థను పూర్తిగా పర్యవేక్షించడం సహ కీలక బాధ్యతలను నిర్వర్తించడానికి శ్రీలంక దిగ్గజం సంగక్కరను నియమించింది.

By

Published : Jan 24, 2021, 10:13 PM IST

Updated : Jan 25, 2021, 6:09 AM IST

Rajasthan Royals appoint Sangakkara as director of cricket
రాజస్థాన్​ క్రికెట్ డైరెక్టర్​గా సంగక్కర

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరకు కీలక పదవి కట్టబెట్టింది ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) ఫ్రాంఛైజీ రాజస్థాన్​ రాయల్స్​. వచ్చే సీజన్​ కోసం అతడిని జట్టుకు డైరెక్టర్​గా ఆదివారం నియమించింది యాజమాన్యం. ప్రస్తుతం మెరీల్​బోన్​ క్రికెట్​ క్లబ్​(ఎంసీసీ) అధ్యక్షుడిగా ఉన్నాడు సంగక్కర.

బాధ్యతల్లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​ కోచింగ్ విధానం, వేలం ప్రణాళికలతో పాటు జట్టు వ్యూహాలను రచించనున్నాడు. ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి మెరుగుపరచడం సహా నాగ్‌పూర్‌లోని రాజస్థాన్​ రాయల్స్ అకాడమీని అభివృద్ధి చేసే బాధ్యతను అతడి అప్పగించింది.

"ప్రపంచంలోనే ప్రముఖ క్రికెట్​ పోటీలో ఫ్రాంఛైజీ వ్యూహాల పర్యవేక్షణ, జట్టు విజయానికి అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనలో పాలుపంచుకునే అవకాశమే నేను బాధ్యతలు స్వీకరించడానికి ప్రేరణ" అని సంగక్కర అన్నాడు.

శ్రీలంక తరఫున 28వేల పైగా పరుగులు చేశాడు సంగక్కర. టెస్టుల్లో గత 46ఏళ్లలో అతడిదే అత్యుత్తమ బ్యాటింగ్ సగటు. డైరెక్టర్​గా సంగా ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.

సంజు శాంసన్

"వికెట్​కీపింగ్​ దిగ్గజంతో కలిసి పనిచేయడం గొప్పగా ఉంది. అతడో అద్భుతమైన వికెట్​కీపర్​-బ్యాట్స్​మెన్​. ఎన్నో ఘనతలు సాధించాడు. మంచి విలవ, వ్యక్తిత్వం గలవాడు." అని శాంసన్ అన్నాడు.

ఇదీ చూడండి:ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!

Last Updated : Jan 25, 2021, 6:09 AM IST

ABOUT THE AUTHOR

...view details