తెలంగాణ

telangana

ETV Bharat / sports

బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. గెలుపు కోసం ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

By

Published : Apr 16, 2019, 7:53 PM IST

పంజాబ్

పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు,, ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్​తో తలపడుతోంది. మొదటగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

ఇరుజట్లు తలపడిన మొదటి మ్యాచ్​లో మన్కడింగ్ వివాదం చెలరేగింది. ఈ కారణంగా రాజస్థాన్ జట్టు ఓటమిపాలైంది. పంజాబ్ కెప్టెన్ అశ్విన్​పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వీరి మధ్య మ్యాచ్ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.

జట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), రాహుల్, గేల్, మయాంక్ అగర్వాల్, మిల్లర్, మన్​దీప్ సింగ్, నికోలస్ పూరన్, మురుగన్ అశ్విన్, ఆండ్రూ టై, మహమ్మద్ షమి, అర్ష్​దీప్ సింగ్

రాజస్థాన్ రాయల్స్
రహానే (కెప్టెన్), బట్లర్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, టర్నర్, స్టువర్ట్ బిన్నీ, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కట్, ధవల్ కులకర్ణి, ఇష్ సోధి

ABOUT THE AUTHOR

...view details