తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: రాజస్థాన్ కొత్త కోచ్​గా ఆసీస్ మాజీ క్రికెటర్ - rajastan royals new coach as andrew mcdonald

రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త కోచ్​ను నియమించింది. ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ మెక్​డోనాల్డ్​కు ఈ బాధ్యతలను అప్పగించింది. మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.

ఐపీఎల్ కోచ్

By

Published : Oct 22, 2019, 7:45 AM IST

ఐపీఎల్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ నియమితుడయ్యాడు. వచ్చే మూడేళ్ల పాటు కోచ్‌గా వ్యవహరించేందుకు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ ట్విట్టర్లో పంచుకుంది.

ఐపీఎల్‌లో ఆండ్రూ.. దిల్లీ డేర్‌డేవిల్స్‌ (ఇప్పటి దిల్లీ క్యాపిటల్స్‌), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడాడు. అలాగే బెంగళూరు జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా కూడా పనిచేశాడు. ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌లో.. కోచ్‌గా విక్టోరియా జట్టును విజేతగా నిలిపాడు. 2018-19 బిగ్‌బాష్‌ సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఆండ్రూ.

అంతర్జాతీయ కెరీర్​లో 4 టెస్టులు ఆడాడు ఆండ్రూ. ఇందులో ఓ అర్ధశతకం ఉంది. 9 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్​క్లాస్ కెరీర్​లో 4,825 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలున్నాయి.

ఇదీ చదవండి: నేటి నుంచే ఫ్రెంచ్ ఓపెన్​.. అందరి కళ్లూ సింధుపైనే

ABOUT THE AUTHOR

...view details