తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్-న్యూజిలాండ్​ తొలి టీ20కి వర్షం ముప్పు! - sports news

కివీస్​తో కోహ్లీసేన తలపడే తొలి టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

భారత్-న్యూజిలాండ్​ తొలి టీ20కి వర్షం ముప్పు!
భారత్-న్యూజిలాండ్​ తొలి టీ20

By

Published : Jan 24, 2020, 10:11 AM IST

Updated : Feb 18, 2020, 5:11 AM IST

టీమిండియా-న్యూజిలాండ్​ మధ్య నేడు జరిగే తొలి టీ20 కోసం ఇరుజట్లు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ మ్యాచ్​ గెలిచి, సిరీస్​లో బోణీ కొట్టాలని చూస్తున్నాయి. కానీ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 6:50 కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో తేలికపాటి జల్లులు కురవొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కువగా వర్షం పడితే మ్యాచ్​ రద్దు చేయొచ్చు.

కివీస్​ పర్యటనలో భాగంగా భారత్.. 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. తొలి మ్యాచ్​ ఈరోజు ఆక్లాండ్​ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:20 గంటలకు మొదలవనుంది.

Last Updated : Feb 18, 2020, 5:11 AM IST

ABOUT THE AUTHOR

...view details