తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాత్యహంకార వ్యాఖ్యలు.. ఆసీస్​ ప్రేక్షకుల తీరు మారదా? - భారత్​ ఆసీస్​ మూడో టెస్టు జాతి వివక్ష

ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యల విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అ అంశమై ఐసీసీ సహా పలువురు భారత, ఆసీస్ మాజీలు, వర్థమాన ఆటగాళ్లు అభిప్రాయల్ని వెల్లడిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ ఆసీస్​ ప్రేక్షకుల నుంచి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెబుతున్నారు. భవిష్యతులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

icc
ఐసీసీ

By

Published : Jan 10, 2021, 5:09 PM IST

బోర్డర్ గవాస్కర్ సిరీస్ మూడో టెస్టులో జాత్యహంకార వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మూడో రోజు ఆటలో పేసర్​ బుమ్రా, మహ్మద్​ సిరాజ్​ వివక్షకు గురయ్యారు. దీనిపై ఐసీసీకి టీమ్​ఇండియా ఫిర్యాదు చేసింది. నాలుగో రోజు ఆటలోనూ సిరాజ్​కు మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతడి​పై ప్రేక్షకుల గుంపు నుంచి ఓ అల్లర్ల మూక జాతి వివక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని సారథి రహానెకు చెప్పగా, అతడు మ్యాచ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది.

వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది, పోలీసులు ఘటనకు పాల్పడిన ఆరుగురు యువకులను బయటకు పంపించారు. ఈ విషయమై క్రికెట్‌ ఆస్ట్రేలియా టీమ్‌ఇండియాకు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు అధికార ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఖండించిన ఐసీసీ

మూడో టెస్టులో టీమ్​ఇండియా క్రికెటర్లపై ఆసీస్​ ప్రేక్షకులు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలపై ఆసీస్​ బోర్డు నివేదిక ఇవ్వాలని సూచించింది. క్రికెట్‌లో ఏ విధమైన వివక్షకు చోటు లేదని చెప్పిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్నీ.. కొందరు ప్రేక్షకుల ప్రవర్తనతో చాలా నిరాశ చెందామని అన్నారు. అభిమానులు నిబంధనలకు కట్టుబడి ఉన్నారా లేరా అన్న అంశాన్ని పరిశీలించాలని సూచించారు. జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన అభిమానులను మైదానం నుంచి బయటకు పంపడాన్ని స్వాగతించారు.

గతంలోనూ చాలాసార్లు

ఈ జాతి వివక్ష వ్యాఖ్యలపై భారత్​కు చెందిన పలువురు మాజీలు, వర్థమాన క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని అంటున్నారు. గతంలో ఆస్ట్రేలియాలో తాను జాతి వివక్ష ఎదుర్కొన్నానని మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ గుర్తు చేసుకున్నాడు. మతం, రంగు సహా మరెన్నో విషయాల్లో మైదానంలో తనపై వ్యాఖ్యలు చేశారని చెప్పాడు. ఆసీస్‌ ప్రేక్షకులు ఇలా చేయడం తొలిసారేం కాదని ట్వీట్‌ చేశాడు.

సిడ్నీ క్రికెట్‌ మైదానంలో వీక్షకుల ప్రవర్తనపై విస్మయం వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సజావుగా సాగుతున్న టెస్టు సిరీస్‌ను పాడుచేయడం దురదృష్టకరమని అన్నాడు. టీమ్​ఇండియా సారథి కోహ్లీ ఈ ఘటనను ఉపేక్షించరాదని అన్నాడు. తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ట్వీట్ కూడా చేశాడు. గతంలోనూ సిడ్నీ వేదికగా చాలాసార్లు టీమ్ఇండియా జాతి వివక్షను ఎదుర్కొందని స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్ అన్నాడు​. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆసీస్​ బోర్డుకు ఉందని చెప్పాడు.

ఆసీస్​ మాజీల ఆగ్రహం

జాతి వివక్ష వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీలు మైకేల్ హస్సీ, షేన్ వార్న్ తీవ్రంగా స్పందించారు. క్రికెటర్లపై అనుచితంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రవర్తనను ఏమాత్రం ఉపేక్షించరాదని తెలిపారు.

ఇదీ చూడండి: అలాంటి వ్యాఖ్యలు ఇదేం తొలిసారి కాదు: అశ్విన్

ABOUT THE AUTHOR

...view details