విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబయి కెప్టెన్ పృథ్వీ షా మరో రికార్డు సృష్టించాడు. ఒక్క సీజన్లోనే అత్యధికంగా 800 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మన్గా నిలిచాడు. ఆదివారం ఉత్తరప్రదేశ్తో జరుగుతోన్న ఫైనల్లో 73 పరుగుల చేసి ఈ మార్క్ను అందుకున్నాడు. ఈ మ్యాచులో అతడి కాలికి గాయమైంది.
పృథ్వీ షా రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్ - prithivi shah
విజయ్ హజారె ట్రోఫీలో పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు. ఒక సీజన్లో అత్యధికంగా 800 పరుగులు చేసి ఈ మార్క్ను అందుకున్నాడు.
పృథ్వీ షా
అంతకుముందు లిస్టు-ఏ మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్మెన్గా ఇటీవల రికార్డు నెలకొల్పిన పృథ్వీ.. ధోనీ, కోహ్లీలను అధిగమించాడు. ఇటీవల సౌరాష్ట్రపై 123 బంతుల్లోనే 185 పరుగులు చేసి ఈ ఫీట్ను సాధించాడు. ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇదీ చూడండి: పృథ్వీ షా రికార్డ్- హజారే టోర్నీలో మరో శతకం