కరోనా వైరస్ ముప్పుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సాధనా శిబిరాలన్నీ ఖాళీ అయ్యాయి. అన్ని ఫ్రాంచైజీలు తమ శిబిరాలను రద్దు చేస్తున్నామని ప్రకటించాయి. తిరిగి పిలుపునిచ్చేంత వరకు ఆటగాళ్లెవరూ రానవసరం లేదని వెల్లడించాయి. ఇప్పటికే ఐపీఎల్ను మార్చి 29 నుంచి ఏప్రిల్ 15కు వాయిదా వేశారు నిర్వాహకులు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సాధనా శిబిరాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం వారి శిబిరం మార్చి 21న ఆరంభం కావాల్సి ఉంది. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ తమ శిబిరాలను ఇప్పటికే రద్దు చేశాయి.