బంగ్లాదేశ్తో జరుగుతున్న డేనైట్ టెస్టులో.. 241 పరుగుల ఆధిక్యంలో తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది టీమిండియా. ఓవర్నైట్ స్కోరు 174/3తో రెండో రోజు(శనివారం) బరిలోకి దిగిన భారత జట్టు.. 9 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.
విరాట్ జోరు...
బంగ్లాదేశ్తో జరుగుతున్న డేనైట్ టెస్టులో.. 241 పరుగుల ఆధిక్యంలో తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది టీమిండియా. ఓవర్నైట్ స్కోరు 174/3తో రెండో రోజు(శనివారం) బరిలోకి దిగిన భారత జట్టు.. 9 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.
విరాట్ జోరు...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(136; 194 బంతుల్లో, 12 ఫోర్లు) శతకం బాదాడు. టెస్టుల్లో 27 శతకం పూర్తి చేసుకున్నాడు. పుజారా (55: 105 బంతుల్లో, 8 ఫోర్లు), వైస్ కెప్టెన్ అజింక్య రహానె(51; 69 బంతుల్లో 7ఫోర్లు) రాణించాడు. మిగతా ఆటగాళ్లలో జడేజా(12), సాహ(17*), అశ్విన్(9), ఉమేశ్ యాదవ్(0), ఇషాంత్(0), షమీ(0*) పరుగులు చేశారు.
బంగ్లా బౌలర్లలో అల్అమిన్ హొస్సేన్, ఎబాదత్ హొస్సేన్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. అబు జాయెద్ 2, తైజు ఇస్లాం 1 వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
శుక్రవారం బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 106 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా మూడు వికెట్లకు 174 పరుగులు చేసింది.