ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ప్రస్తుత తరంలో ఇతడి ప్రత్యేకతే వేరు. కెప్టెన్గా, బ్యాట్స్మన్గా, ఫినిషర్గా తనదైన ముద్ర వేశాడు. వాటిని అందుకోవాలన్నా, అధిగమించాలన్నా సరే ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చేమో!
ధోనీ కెప్టెన్సీలోనే భారత్.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెల్చుకోవడం సహా 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానం సొంతం చేసుకుంది.
గతంలో తన సహచర క్రికెటర్ తన్వీర్ అహ్మద్, ధోనీ గురించి తనకు ఫోన్ కాల్లో చెప్పిన ఆసక్తికర విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్.
2004లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ధోనీ "2004లో కెన్యా పర్యటనలో ఉన్న తన్వీర్ అహ్మద్ నాకు చెప్పిన విషయం బాగా గుర్తుంది. అప్పుడు నేను ఇంగ్లాండ్లో ఉన్న కారణంగా ఫోన్లో మాట్లాడాను. 'రషీద్ భాయ్.. సచిన్ను మర్చిపోయేలా చేసే ఓ క్రికెటర్ వచ్చాడు అని అన్నాడు'. 'అది అసాధ్యం, సచిన్ సచినే.. అలాంటి ఆటగాడిని ఎలా మర్చిపోగలం' అని నేను బదులిచ్చాను" -రషీద్ లతీఫ్, పాక్ మాజీ కెప్టెన్
2004 డిసెంబరులో బంగ్లాదేశ్ వన్డేతో 23 ఏళ్ల వయసులో ధోనీ కెరీర్ ప్రారంభించాడు. తర్వాతి ఏడాది విశాఖపట్నంలోని పాకిస్థాన్ వన్డేలో తొలి సెంచరీ(148) నమోదు చేసి వెలుగులోకి వచ్చాడు. తర్వాత సంవత్సరం జైపుర్లో శ్రీలంకపై అజేయంగా 183 పరుగులు చేసి, వన్డేల్లో తన అత్యధిక స్కోరు చేశాడు. 2006లో పాకిస్థాన్పై తొలి టెస్టు శతకం(148) సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో పాల్గొనడంలో భాగంగా దుబాయ్లో ఉన్నాడు మహీ.