తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికా సిరీస్​లో నా బెస్ట్ ఇస్తా: పంత్

స్వదేశంలో జరుగనున్న దక్షిణాఫ్రికా సిరీస్​ను సరికొత్తగా ఆరంభించాలనుకుంటున్నానని చెప్పాడు టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్.

By

Published : Sep 11, 2019, 5:56 PM IST

Updated : Sep 30, 2019, 6:16 AM IST

రిషభ్ పంత్

వెస్టిండీస్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ విమర్శలు ఎదుర్కొన్నాడు. త్వరలో స్వదేశంలో జరుగనున్న దక్షిణాఫ్రికా సిరీస్​పైనే పూర్తిగా దృష్టి పెట్టానని చెబుతున్నాడీ క్రికెటర్. ఈ సిరీస్​ను సరికొత్తగా ఆరంభించాలనుకుంటున్నానని అన్నాడు.

"దక్షిణాఫ్రికా సిరీస్​ కోసం తీవ్రంగా సాధన చేశా. సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలనుకుంటున్నా. మంచి ఆరంభంతో అత్యుత్తమంగా ఆడాలనుకుంటున్నా. ఆటను మెరుగు పరుచుకుని, ఎక్కువ మ్యాచ్​ల్లో​భారత్ గెలిచేందుకు నా వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తాను." - రిషభ్ పంత్, టీమిండియా వికెట్ కీపర్

మహేంద్రసింగ్ ధోనీతో తనను పోల్చుతున్న తరుణంలో ఆ విషయంపై స్పందించాడు పంత్. మహీకి తను వీరాభిమానినని, ప్రస్తుతం తన ఆటను మెరుగుపరుచుకునేందుకే చూస్తున్నానని చెప్పాడు.

విండీస్ పర్యటనలో ఎన్ని అవకాశాలిచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయాడని మాజీలు సైతం పంత్​పై మండిపడ్డారు.

దక్షిణాఫ్రికాతో ఈ నెల 15 నుంచి మూడు టీ-20ల సిరీస్​ను ఆడనుంది టీమిండియా. తొలి మ్యాచ్ ధర్మశాలలో జరుగనుంది.

ఇదీ చదవండి: బీచ్ ఒడ్డున అనుష్క ఒడిలో విరాట్

Last Updated : Sep 30, 2019, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details