తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​లో పదేళ్ల తర్వాత శ్రీలంక తొలి వన్డే - నేడు కరాచీ వేదికగా తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్

పాకిస్థాన్​లో 10 ఏళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్​ ఆడుతోంది శ్రీలంక జట్టు. నేడు కరాచీ వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. 2009లో క్రికెటర్లపై ఉగ్రదాడి తర్వాత పాక్​లో మళ్లీ అడుగుపెట్టారు లంకేయులు.

కరాచీలో పదేళ్ల తర్వాతే ఎందుకు తొలి వన్డే..?

By

Published : Sep 27, 2019, 8:12 AM IST

Updated : Oct 2, 2019, 4:33 AM IST

కరాచీ వేదికగా పాకిస్థాన్​, శ్రీలంక మధ్య నేడు ద్వైపాక్షిక వన్డే సిరీస్​ ప్రారంభం కానుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ వేదికపై తొలి మ్యాచ్​కు ఆతిథ్యమిస్తోంది పాక్​. ఈ పర్యటనలో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్​లు ఆడనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ సిరీస్​ జరగనుంది.

ఉగ్ర దాడితో బెంబేలు...

2009 మార్చి 3న లాహోర్‌లో లంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో శ్రీలంకకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. అప్పట్నుంచి పాక్‌లో పర్యటించేందుకు పలు దేశాలు తిరస్కరిస్తున్నాయి. ఆ దాడి తర్వాత తొలిసారి 2015లో పాక్‌లో పర్యటించింది జింబాబ్వే. చివరగా 2018లో టీ20 సిరీస్‌ కోసం పాక్‌లో పర్యటించింది వెస్టిండీస్‌.

అప్పట్లో ఓ పొట్టి మ్యాచ్​...

2009 దాడి తర్వాత శ్రీలంక జట్టు ఓ సారి పాకిస్థాన్​ వెళ్లింది. 2017 అక్టోబర్‌లో లాహోర్‌ వేదికగా ఒక టీ20 మ్యాచ్ ఆడింది లంక. అయితే అప్పటి కెప్టెన్‌గా థిసార పెరీరా కూడా ఈసారి పాకిస్థాన్​ వెళ్లేందుకు నిరాకరించాడు.

భద్రతా కారణాలు దృష్ట్యా ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు పలువురు సీనియర్ క్రికెటర్లు నిరాకరించడం వల్ల... ద్వితీయ శ్రేణి యువ ఆటగాళ్లను మ్యాచ్​లకు పంపింది శ్రీలంక క్రికెట్ బోర్డు. వన్డే జట్టుకు లాహిరు తిరుమన్నే సారథ్యం వహిస్తుండగా... టీ20లకు దాసున్ షణకను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఈ మ్యాచ్​లకు వెళ్లేముందు లంక క్రికెటర్లు మళ్లీ క్షేమంగా ఇళ్లకు రావాలని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తాయెత్తులు కట్టుకొని వెళ్లారు. ఈ సిరీస్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాకిస్థాన్​.. ఆటగాళ్లకు ప్రధాని స్థాయి భద్రతతో తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

లంక వన్డే జట్టు:

లాహిరు తిరుమన్నే(కెప్టెన్), ధనుష్క గుణతిలక, సధీర సమరవిక్రమ, అవిష్క ఫెర్నాండో, ఒషాడా ఫెర్నాండో, షెహన్​ జయసూర్య, దసున్​ శంకర, మినోద్​ భానుక, ఏంజిలో పెరెరా, వనిందు హసరంగా, లక్షన్​ సందకన్​, నువాన్​ ప్రదీప్​, ఇసురు ఉదాన, కసున్​ రజిత, లాహిరు కుమార

టీ20 జట్టు:

దసున్ శనక(కెప్టెన్), ధనుష్క గుణతిలక, సధీర సమరవిక్రమ, అవిష్క ఫెర్నాండో,ఒషాడా ఫెర్నాండో, షెహన్​ జయసూర్య, ఏంజిలో పెరెరా, భానుక రాజపక్ష, మినోద్​ భానుక, లాహిరు మదుశంక, వనిందు హసరంగ, లక్షన్​, నువాన్​ ప్రదీప్​, కసున్​ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదాన

ఇవీ చూడండి...

Last Updated : Oct 2, 2019, 4:33 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details