తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియాను ఫాలో అయిన పాకిస్థాన్​.. - Sachin Tendulkar news

సుదీర్ఘ ఫార్మాట్లో​ భారత్​ నమోదు చేసిన ఓ రికార్డును పాకిస్థాన్​ రిపీట్​ చేసింది. కరాచీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో.. పాక్​ ఓపెనర్లు నలుగురూ శతకాలు సాధించారు. ప్రపంచ క్రికెట్లో ఇలాంటి ఘనతను తొలుత నమోదు చేసింది భారత్​ కాగా.. దాయాది దేశం రెండో జట్టుగా నిలిచింది.

batsmen Babar, Azhar, Abid, Masood
టీమిండియాను ఫాలో అయిన పాకిస్థాన్​..

By

Published : Dec 22, 2019, 3:54 PM IST

కరాచీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్​ ఆటగాళ్లు అరుదైన రికార్డు నమోదు చేశారు. ఫలితంగా సుదీర్ఘ ఫార్మాట్​లో టాప్​-4 బ్యాట్స్​మెన్లు శతకాలు చేసిన రెండో జట్టుగా ఘనత సాధించింది పాక్. 2007లో బంగ్లాదేశ్​పై భారత ఆటగాళ్లు వసీం జాఫర్​, దినేశ్​ కార్తీక్​, రాహుల్​ ద్రవిడ్​, సచిన్​ తెందూల్కర్​ శతకాలతో రికార్డు సృష్టించారు.

లంకతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో.. మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 555 పరుగులు చేసింది పాకిస్థాన్​. ఇందులో బాబర్​ అజామ్(100*)​, అబిద్​ అలీ(174), అజహర్​ అలీ(118), షాన్​ మసూద్​(135) సెంచరీలు సాధించారు.

అలీ రికార్డు...

తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన తొలి పాకిస్థాన్​ క్రికెటర్‌గా అబిద్‌ అలీ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాట్స్​మన్​గా పేరుతెచ్చుకున్నాడు. అరంగేట్ర వన్డే, టెస్టుల్లో సెంచరీ చేసిన ఏకైక పాక్‌ ఆటగాడిగా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details