తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీలు పరువు నిలుపుకుంటారా..!

వరల్డ్​కప్​లో నేడు దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ లార్డ్స్ వేదికగా నేడు తలపడనున్నాయి. ఇప్పటికే సెమీస్ రేసులో లేని సఫారీలు.. ఇందులో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు.

By

Published : Jun 23, 2019, 7:18 AM IST

సఫారీలు పరువు నిలుపుకుంటారా..!

ప్రపంచకప్​ సెమీస్​ రేసు నుంచి వైదొలగిన దక్షిణాఫ్రికా.. ఆ ప్రయత్నంలో ఆపసోపాలు పడుతున్న పాకిస్థాన్.. నేడు లార్డ్స్ వేదికగా తలపడనున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ సీజన్​లో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్​ ఇదే.

ఇరుజట్లు చెరో మూడు పాయింట్ల సాధించి పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నాయి. దక్షిణాఫ్రికా 8, పాకిస్థాన్ 9వ స్థానంలో ఉన్నాయి.

అభిమానుల నుంచి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న పాక్.. ఈ మ్యాచ్​లోనైనా గెలిచి తీరాలని భావిస్తోంది. ఆ జట్టులో బౌలర్ ఆమిర్ ఒక్కడే ఆకట్టుకుంటున్నాడు. విజయం దక్కాలంటే మిగతా వారు రాణించాల్సిన అవసరముంది.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు

ఈ ప్రపంచకప్​లో నిరాశజనక ప్రదర్శన చేస్తోంది సఫారీ జట్టు. ఆడిన అన్ని మ్యాచ్​ల్లోనూ చేతులెత్తేసింది. అద్భుతమైన క్రికెటర్లు ఉన్నా.. వారి స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్నారు. ఈ రోజైనా గెలిచి పరువు నిలుపుకుంటారా లేదా అనేది చూడాలి.

దక్షిణాఫ్రికా జట్టు

జట్లు (అంచనా)

పాకిస్థాన్: సర్ఫరాజ్(కెప్టెన్), హఫీజ్, షోయాబ్ మాలిక్, బాబర్ ఆజమ్, ఇమాముల్ హక్, ఇమాద్ వసీమ్, వాహబ్ రియాజ్, ఫకర్ జమాన్, షాదాబ్ ఖాన్, హాసన్ అలీ

దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్, డుప్లెసిస్, మిల్లర్, మోరిస్, వాన్​డర్​డసెన్, మార్క్రమ్, తాహిర్, రబాడా, ఫెలుక్వాయో, ఎంగిడి

ఇది చదవండి: ప్రపంచకప్​లో పాకిస్థాన్​పై భారత్ సమష్టి విజయం

ABOUT THE AUTHOR

...view details