తెలంగాణ

telangana

ETV Bharat / sports

పదేళ్ల తర్వాత పాకిస్థాన్​లో టెస్టు సిరీస్ - Rawalpindi, Karachi, Sri Lanka, PCB, ICC World Test Championship, Shammi de Silva, Bangladesh Cricket Board

దశాబ్దం తర్వాత సుదీర్ఘ ఫార్మాట్​ మ్యాచ్​లకు ఆతిథ్యమిస్తోంది పాకిస్థాన్​. రావల్పిండి, కరాచీ వేదికలుగా శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్​లను ఆడనుంది పాక్​ జట్టు.

10 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​లో టెస్టు సిరీస్

By

Published : Oct 28, 2019, 6:39 AM IST

Updated : Oct 28, 2019, 11:46 AM IST

శ్రీలంకతో టెస్టు సిరీస్​కు వేదికలను ప్రకటించింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ). రావల్పిండి, కరాచీ వేదికలుగా... డిసెంబరులో మ్యాచ్​లు జరగనున్నాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత పాక్​ మళ్లీ టెస్టు సిరీస్​కు ఆతిథ్యమిస్తోంది.

ఐసీసీ ఛాంపియన్​షిప్​లో భాగంగా శ్రీలంక-పాకిస్థాన్​ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ జరగనుంది. డిసెంబర్​ 11న తొలి టెస్టు, 19న రెండో టెస్టు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్​లకు లంక వస్తే... జనవరిలో టీ20 సిరీస్​కు బంగ్లాదేశ్​ వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుందని భావిస్తోంది.

ఉగ్రదాడి తర్వాత...

2009లో లాహోర్​లో లంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. అప్పట్నుంచి ఏ దేశం దాయాది గడ్డపై కాలు మోపలేదు. ఈ ఏడాది సెప్టెంబర్​లో దాదాపు దశాబ్ద కాలం తర్వాత​ టీ20లు, వన్డేలు ఆడేందుకు ఆ దేశం వెళ్లింది లంక జట్టు. అయితే ఈ పర్యటనకు ముందు లంక సీనియర్​ క్రికెటర్లు పాక్​ వెళ్లేందుకు నిరాకరించడం సంచలనమైంది. ఎట్టకేలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపింది లంకబోర్డు. దాయాది దేశం వెళ్లి క్షేమంగా రావాలని లంక ఆటగాళ్లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఫొటోలు అప్పట్లో వైరల్​ అయ్యాయి.

తాయెత్తులు కట్టించుకుంటున్న లంక ఆటగాళ్లు

బుల్లెట్​ ప్రూఫ్​ వాహనాల్లో...

భద్రత పట్ల ఆందోళన ఉన్నప్పటికీ పాకిస్థాన్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్న శ్రీలంక క్రికెట్‌ జట్టుకు... ఆ దేశం అధ్యక్ష స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల్లో హోటల్‌కు తరలించింది. వాహనాల్లో క్రీడాకారులను తీసుకెళ్తున్న వీడియోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టాయి.

లైట్లు వెలగలేదు...

అక్టోబర్​ 1న పాక్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డేను డే/నైట్ మ్యాచ్​గా నిర్వహించారు. ఆట జరుగుతున్న సమయంలో కరాచీ స్టేడియంలోని ఫ్లడ్​లైట్లు పదేపదే ఆగిపోవడం వల్ల చాలాసార్లు అంతరాయం కలిగింది. దీనిపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి.

వన్డే సిరీస్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ గెలిచినా.. టీ20 సిరీస్‌లో మాత్రం క్లీన్​స్వీప్​ అయింది. పొట్టి ఫార్మాట్​లో అగ్రస్థానంలో ఉన్న పాక్​ జట్టు... మూడు మ్యాచ్​లూ ఓటమిపాలైంది.

Last Updated : Oct 28, 2019, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details