తెలంగాణ

telangana

'అందుకే భారత్​ చేతిలో పాక్​ మళ్లీ ఓడింది'

By

Published : Jun 19, 2020, 5:10 PM IST

గత వన్డే ప్రపంచకప్​లో భారత్​తో మ్యాచ్​లో చేసిన​ స్వీయ తప్పిదాలే.. పాకిస్థాన్ ఓటమికి కారణమని అన్నారు ఆ దేశ ప్రస్తుత బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్. దీనితో పాటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్​లను పాక్ బౌలర్లు ఔట్ చేయలేకపోయారని చెప్పాడు.

Pakistan got it wrong against India right from toss in 2019 World Cup: Waqar Younis
పాక్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్

ఓటముల పరంపరను కొనసాగిస్తూ, 2019 వన్డే ప్రపంచకప్​లో పాకిస్థాన్, భారత్ చేతిలో ఓడిపోయింది. అయితే టాస్​ నుంచి తడబడటం వల్లే ఈ మ్యాచ్​ను పాక్​ కోల్పోయిందని ఆ దేశ మాజీ బౌలర్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. ఆ రోజుకు జరిగిన విషయాలు తన మనసులో ఇంకా అలానే ఉన్నాయని చెప్పాడు. దీనితో పాటే టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్ రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​ పరుగులు చేయడాన్ని ఆపలేకపోవడం ఓటమికి మరో కారణమని అన్నాడు.

"ప్రపంచకప్​లో భారత్​తో మ్యాచ్​లో పాక్, టాస్​ ఎంపిక దగ్గర నుంచే తడబడింది. టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న పాకిస్థాన్.. ప్రత్యర్థి జట్టులో టాప్​ బ్యాట్స్​మెన్ వికెట్లు తీసి, వారిపై ఒత్తిడి తీసుకురావాలని భావించింది. కానీ బ్యాటింగ్​కు వచ్చిన రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​.. పాక్​ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఓ దశలో వారిని నియంత్రించడం చాలా కష్టమైంది. నాకు తెలిసి టాస్​ ఎంచుకోవడంలో విఫలమైన పాక్, భారత్​ గెలవడానికి అవకాశం ఇచ్చినట్లు అయింది"

- వకార్​ యూనిస్​, పాకిస్థాన్​ బౌలింగ్​ కోచ్​

టీమ్​ఇండియా, పాకిస్థాన్​ జట్లు

ఈ​ మ్యాచ్​లో టీమ్​ఇండియా చేతిలో 89 పరుగుల తేడాతో దాయాది జట్టు ఓటమి పాలైంది. ప్రపంచకప్​ చరిత్రలో వరుసగా ఏడోసారి పాక్​ జట్టుపై గెలిచి రికార్డు సృష్టించింది.

మెగాటోర్నీలో పాకిస్థాన్​తో జరిగిన ప్రతి మ్యాచ్​లోనూ టీమ్​ఇండియా క్రికెటర్లు అద్భుత ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. 2003 ప్రపంచకప్​లో పాక్​పై సచిన్​ ఆడిన ఇన్నింగ్స్​ ఇప్పటికీ అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలవడం విశేషం.

ఇదీ చూడండి... 'ఆ మ్యాచ్​ కోసం బౌలర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details