తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2019, 5:20 AM IST

Updated : Jun 14, 2019, 6:42 AM IST

ETV Bharat / sports

'ఆ రోజు మాలోని అత్యుత్తమ ఆట ప్రదర్శిస్తాం'

ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో మ్యాచ్​లో అత్యుత్తమంగా ఆడతామని చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత్​ ఆడనున్న చివరి లీగ్​ మ్యాచ్​లలోగా ధావన్ సిద్ధమవుతాడని అన్నాడు.

'ఆ రోజు మాలో అత్యుత్తమ ఆట ప్రదర్శిస్తాం'

భారత్- పాకిస్థాన్ మ్యాచ్​ అంటే క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువ. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడితే ఫ్యాన్స్​కు పండగే పండగ. ప్రస్తుత ప్రపంచకప్​లో జూన్ 16న ఈ రెండింటి మధ్య మ్యాచ్​ జరగనుంది. పాక్​తో జరిగే ఈ మ్యాచ్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ చెప్పాడు.

"క్రికెట్​లో ప్రపంచకప్​ అత్యుత్తమమైనది. పాక్​తో ఈ టోర్నీలో ఆడటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఆ రోజు అత్యుత్తమ ఆట కనబరుస్తాం. ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. కచ్చితంగా అమలు పరుస్తాం ." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

భారత్- పాక్ క్రికెట్ జట్ల సారధులు

గురువారం న్యూజిలాండ్​తో జరగాల్సిన భారత్ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం టీమిండియా మూడో స్థానంలో ఉంది.

శిఖర్ ధావన్ గాయంపైనా స్పందించాడు భారత క్రికెట్ జట్టు సారథి కోహ్లీ

"కొన్ని వారాల పాటు శిఖర్​కు విశ్రాంతి అవసరం. చివరి లీగ్​ మ్యాచ్​ల సమయానికి అతడు సిద్ధమవుతాడని ఆశిస్తున్నా. ధావన్ రాక కోసం మేం ఎదురు చూస్తున్నాం" --విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

ఇది చదవండి: భారత్​ -కివీస్​ మ్యాచ్​ వర్షార్పణం

Last Updated : Jun 14, 2019, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details