పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ ఫవాద్ ఆలమ్ టెస్టుల్లోకి పునరాగమనం చేశాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత తెలుపు జెర్సీలో కనువిందు చేస్తున్నాడు. సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ పాక్ సీనియర్ క్రికెటర్. ఇది తన కెరీర్లో నాలుగో టెస్టు మ్యాచ్. ఈ కాలంలో మొత్తం 88 మ్యాచ్లు మిస్సయ్యాడీ 34 ఏళ్ల దాయాది క్రికెటర్.
2019లో ఫస్ట్క్లాస్ టోర్నీ అయిన ఖ్వాయిద్-ఇ-అజామ్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేయడం వల్ల మళ్లీ దశాబ్ద కాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు ఫవాద్.