తెలంగాణ

telangana

'ఆసీస్​ను ఓడించే దమ్ము టీమిండియాకు మాత్రమే ఉంది'

By

Published : Dec 3, 2019, 6:30 AM IST

ఆస్ట్రేలియా తన పూర్వవైభవాన్ని తెచ్చుకుంటోందని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తప్ప.. ఆసీస్​ను వారి సొంతగడ్డపై ఓడించే సత్తా ఇంకెవరికీ లేదని చెప్పాడు.

Only India have the tools to challenge Australia in Australia: Michael Vaughan after Pakistan's horror run
ఆసీస్​ను ఓడించే దమ్ము భారత్​కు మాత్రమే ఉంది: వాన్​

పాకిస్థాన్​తో టెస్టు సిరీస్​నుఆస్ట్రేలియా.. 2-0 తేడాతో క్లీన్​స్వీప్ చేయడంపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. అంతర్జాతీయ క్రికెట్లో కంగారూ జట్టు పూర్వవైభవం తెచ్చుకుంటోందని అన్నాడు. ప్రస్తుతం ఆసీస్​ను వారి గడ్డపై ఓడించే సత్తా భారత్​కు మాత్రమే ఉందని ట్వీట్ చేశాడు.

"ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించే సత్తా ఉన్న జట్టు టీమిండియానే. భారత్​కు అందుకు సరిపడా వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రస్తుతం పాక్​తో జరిగిన టెస్టు సిరీస్ చూస్తేనే ఆసీస్​ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది" -మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.

ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో విజయభేరీ మోగించింది టీమిండియా. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకొని సత్తాచాటింది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఈ సిరీస్​కు వార్నర్, స్మిత్ దూరమయ్యారు.

అడిలైడ్ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో గెలిచింది. రెండు టెస్టుల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది. డేవిడ్ వార్నర్.. తొలి టెస్టులో శతకంతో పాటు.. రెండో టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు.

పాకిస్థాన్​పై టెస్టు సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో ఆస్ట్రేలియా 176 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ మెగాటోర్నీ మొదలైన తర్వాత ఇప్పటివరకు 7 టెస్టులు ఆడింది కంగారూ జట్టు. 360 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో ఉంది.

ఇదీ చదవండి: స్టీవ్​ స్మిత్​ను టిమ్​ పైన్ చిన్నచూపు చూస్తున్నాడా..!

ABOUT THE AUTHOR

...view details