భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ తాత్కాలిక నిషేధం విధించిన క్రమంలో తమ ఆటగాళ్ల భద్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆ దేశ క్రికెట్ సంఘం. ఐపీఎల్లో భాగంగా ప్రస్తుతం భారత్లో ఉన్న తమ ఆటగాళ్ల గురించి ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. క్రికెటర్ల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
ఇటీవల భారత్ నుంచి న్యూజిలాండ్కు వెళ్లిన 23 మంది ప్రయాణికులలో 17 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో ఈ నెల 28 వరకు ప్రయాణికులను తాత్కాలికంగా నిషేధించింది న్యూజిలాండ్. అయితే ఐపీఎల్ కోసం ఇండియాలో ఉన్న ఆటగాళ్ల సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు భారత్తో సంప్రదింపులు జరుపుతున్నామని కివీస్ బోర్డు తెలిపింది.