తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్ ఆటగాళ్లకు బిర్యానీ, మాంసం కట్ - No more biryani

పాకిస్థాన్ క్రికెటర్ల ఆహారపు నియమాలపై దృష్టిపెట్టాడు ఆ జట్టు కోచ్ మిస్బావుల్ హక్. బిర్యానీ, స్వీట్స్ లాంటి పదార్థాలకు దూరంగా ఉండాలని ఆటగాళ్లకు ఆదేశించాడట.

మిస్బా

By

Published : Sep 17, 2019, 2:02 PM IST

Updated : Sep 30, 2019, 10:47 PM IST

ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్​లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఆ సమయంలో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ ఫిట్‌నెస్‌ విషయం చర్చనీయాంశమైంది. భారత్​తో జరిగిన మ్యాచ్​లో ఈ ఆటగాడు ఆవలింతలు తీస్తూ కనిపించాడు. ఫలితంగా విమర్శలపాలయ్యాడు. దీనికి కారణం పాక్ ఆటగాళ్ల ఆహారపు అలవాట్లు, ఫిట్​నెస్​ లోపాలు అని పలువురు అభిప్రాయపడ్డారు. ఇటీవలే పాక్ కోచ్​గా బాధ్యత తీసుకునన్న మిస్బా.. క్రికెటర్ల ఫిట్​నెస్​పై దృష్టిపెట్టాడు. బిర్యానీ, స్టీట్లకు దూరంగా ఉండాలని ఆటగాళ్లను ఆజ్ఞాపించాడట.


దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్​ల సమయంలో బిర్యానీ, స్వీట్స్​, ఎక్కువ నూనెలో వండిన రెడ్​మీట్​లకు దూరంగా ఉండాలని చెప్పాడట మిస్బా. ఎవరైన ఈ నిబంధనల్ని అతిక్రమించితే వారిపై వేటు వేసేందుకూ వెనకాడబోమని ఆదేశించాడట.

ఇటీవల పాకిస్థాన్ కోచ్, చీఫ్ సెలక్టర్​ పదవుల్ని మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్​కు అప్పగించింది పాక్​ క్రికెట్ బోర్డు. జట్టును మళ్లీ గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు మిస్బా.

పాకిస్థాన్, శ్రీలంక మధ్య కరాచీ వేదికగా ఈనెల 27 నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరగనుండగా.. ఆ తర్వాత అక్టోబరు 5 నుంచి లాహోర్‌ వేదికగా మూడు టీ20లు జరగనున్నాయి. అయితే పాక్ గడ్డపై పర్యటించేందుకు శ్రీలంక క్రికెటర్లు నిరాకరిస్తున్నారు. ఫలితంగా ఈ సిరీస్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

ఇవీ చూడండి.. 'ధోనీ రిటైర్మెంట్​ విషయాన్ని వారే తేల్చాలి'

Last Updated : Sep 30, 2019, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details