తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కొత్త సెలక్షన్ కమిటీ బాధ్యతలు అప్పటి నుంచే' - No Gautam Gambhir but Madan Lal, Sulakshana Naik to be part of new BCCI Cricket Advisory Committee

టీమిండియా కొత్త సెలక్షన్ కమిటీపై మాట్లాడాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. త్వరలోనే కొత్త సభ్యుల ఎంపిక జరుగుతుందని తెలిపాడు.

గంగూలీ
గంగూలీ

By

Published : Jan 28, 2020, 6:42 AM IST

Updated : Feb 28, 2020, 5:38 AM IST

ప్రస్తుతం నూతన సెలక్షన్ కమిటీని ఎంపిక చేసే పనిలో ఉంది బీసీసీఐ. అందుకోసం నామినేషన్ల ప్రక్రియను ముగించింది. లక్ష్మణ్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్, రాజేశ్ చౌహాన్, వెంకటేశ్ ప్రసాద్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎంపికైన సభ్యులు ఎప్పుడు బాధ్యతలు చేపడతారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.

"న్యూజిలాండ్​ టెస్టు సిరీస్​కు పాత సెలక్షన్ కమిటీనే ఆటగాళ్లను ఎంపిక చేసింది. మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్​ కోసం జట్టును కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ పదవుల కోసం త్వరలోనే ఇంటర్వ్యూలు జరుగుతాయి."
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

క్రికెట్ సలహా కమిటీ గురించీ మాట్లాడాడు గంగూలీ. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న గంభీర్​ ఈ కమిటీలో చేరే అవకాశం లేనందున మరో వ్యక్తిని త్వరలోనే నియమిస్తామని చెప్పాడు. మదన్​లాల్, సులక్షణ నాయక్​ పేర్లలో మార్పు లేదని తెలిపాడు.

ఇవీ చూడండి.. మరో ట్రిపుల్ సెంచరీకి చేరువలో సర్ఫరాజ్

Last Updated : Feb 28, 2020, 5:38 AM IST

ABOUT THE AUTHOR

...view details