తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2020, 11:25 AM IST

Updated : Mar 3, 2020, 3:27 AM IST

ETV Bharat / sports

సాకులు చెప్పను.. ఓటమిని అంగీకరిస్తున్నా: విరాట్ కోహ్లీ

కివీస్​పై టెస్టు సిరీస్​ ఓటమి అనంతరం మాట్లాడిన కోహ్లీ.. తాము చేసిన తప్పిదాల వల్లే ఓడామని అన్నాడు. సాకులు చెప్పదల్చుకోవట్లేదని చెప్పాడు.

సాకుల చెప్పను.. ఓటమిని అంగీకరిస్తున్నా: విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ

న్యూజిలాండ్​తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. సిరీస్​ను 0-2 తేడాతో కోల్పోయి, ప్రత్యర్థి చేతిలో వైట్​వాష్ అయింది. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తమ ఆటగాళ్ల చేసిన తప్పిదాల వల్లే ఓడామని అన్నాడు.

"ఈ ఓటమిని మేం అంగీకరిస్తున్నాం. సాకులు చెప్పడానికి ఏం లేదు. వీటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు పోతాం. టెస్టుల్లో మేం అనుకున్నంతగా ఆడలేకపోయాం. ఈ మ్యాచ్​లో బౌలర్ల కష్టానికి తగ్గట్లు బ్యాట్స్​మెన్ రాణించకపోవడం దురదృష్టకరం. రోహిత్ అందుబాటులో లేడు. నేనూ పరుగులు చేయలేకపోయాను" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

కివీస్​ పర్యటనలో భారత్.. టీ20 సిరీస్​ను 5-0 తేడాతో గెల్చుకోగా, వన్డేల్లో 0-3, టెస్టుల్లో 0-2 తేడాతో వైట్​వాష్​కు గురైంది. అయితే ఈ టూర్​లో కెప్టెన్​గానే కాకుండా బ్యాట్స్​మన్​గానూ విఫలమయ్యాడు విరాట్.

విరాట్ కోహ్లీ
Last Updated : Mar 3, 2020, 3:27 AM IST

ABOUT THE AUTHOR

...view details