తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో 'నోబాల్​ అంపైర్​'- పవర్​ ప్లేయర్​కు దక్కని చోటు - front-foot no-balls

టీ20 క్రికెట్లో ఐపీఎల్​తో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన బీసీసీఐ.. తాజాగా 'నో బాల్​ అంపైర్'​ను తెరపైకి తెచ్చింది. పొట్టి క్రికెట్‌లో పారదర్శకత పెంచేందుకు ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. బౌలర్​ యాక్షన్​ను పరిశీలిస్తూ... నోబాల్​పై కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటిస్తాడీ అంపైర్.​

ఐపీఎల్​లో 'నోబాల్​ అంపైర్​'... పవర్​ ప్లేయర్​కు దక్కని చోటు

By

Published : Nov 5, 2019, 7:38 PM IST

ఐపీఎల్​లో సరికొత్త మార్పులకు ఆమోదం తెలిపింది ఐపీఎల్​ పాలకవర్గం. నేడు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన ఈ బృందం... పలు కీలక అంశాలపై చర్చించింది. నోబాల్​ కోసం ప్రత్యేక అంపైర్​ను తెరపైకి తీసుకువచ్చి... ఆసక్తి రేకెత్తించిన 'పవర్​ ప్లేయర్'​ విధానాన్ని తోసిపుచ్చింది.

నోబాల్​ అంపైర్​...

వచ్చే ఏడాది ఐపీఎల్​ నుంచే ఈ సరికొత్త అంపైర్​ దర్శనమివ్వనున్నాడు. ప్రత్యేకంగా నోబాల్స్​ చూసేందుకే ఇతడు పనిచేస్తాడు. గత ఐపీఎల్​లో జరిగిన తప్పిదాలను పరిశీలించాక ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ​. ఈ అంపైర్​ ప్రత్యేక సాంకేతికత వాడుతూ నోబాల్స్​ గుర్తిస్తాడు. ఇతడిని థర్డ్​, ఫోర్త్​ అంపైర్​గా భావించరు.

గత ఐపీఎల్​లో ఫ్రంట్​ ఫుట్​ నోబాల్స్​ గమనించడంలో అంపైర్ల వైఫల్యం కారణంగా చాలా మ్యాచ్​ల ఫలితాలు తారుమారయ్యాయి. దీనికి చెక్​ పెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. తొలుత జాతీయ టీ20 టోర్నీ... ముస్తాక్‌ అలీ (నవంబరు 9 నుంచి) ట్రోఫీలో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నారు. ఆ తర్వాత దీనికి తుది అనుమతి రానుంది.

పవర్​ ప్లేయర్​కు నిరాశ...

వచ్చే ఐపీఎల్‌ నుంచి 'పవర్‌ ప్లేయర్‌' అనే కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టాలని భావించింది భారత క్రికెట్​ బోర్డు. కానీ ఈ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఈ విధానాన్ని ఐపీఎల్​ కంటే ముందు ముస్తాక్‌ అలీ టోర్నీలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సమయం లేదనే కారణంతో దీనికి ఆమోదం లభించలేదు.

ఏంటీ పద్ధతి..?

జట్లు మ్యాచ్‌లో ఏ దశలోనైనా (వికెట్‌ పడ్డాక లేదా ఓవర్‌ పూర్తయ్యాక) పవర్‌ ప్లేయర్‌గా పిలిచే సబ్‌స్టిట్యూట్‌ను బరిలోకి దించే ప్రక్రియే ఇది. ఈ ప్రతిపాదన ప్రకారం ఐపీఎల్‌లో జట్టు తుది ఎలెవన్‌ బదులుగా 15 మందితో కూడిన జట్టును ప్రకటిస్తుంది. వికెట్‌ పడ్డప్పుడు లేదా ఓవర్‌ ముగిశాక ఆటగాణ్ని సబ్‌స్టిట్యూట్‌గా దించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details