తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2019, 2:23 PM IST

ETV Bharat / sports

ఉగ్రవాదుల హిట్​లిస్ట్​లో టీమిండియా సారథి

టీమిండియా సారథి కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉంది. కొత్తగా ఏర్పాటైన ఆల్​ ఇండియా లష్కరే తోయిబా ఉగ్ర ముఠా విరాట్​ను తమ హిట్​లిస్ట్​లో చేర్చింది.

కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు ఉందట. అవును మీరు విన్నది నిజమే. జాతీయ దర్యాప్తు సంస్థకు అందిన సమాచారం ప్రకారం కొత్తగా ఏర్పాటైన ఆల్​ ఇండియా లష్కరే తోయిబా ఉగ్రవాద ముఠా తమ హిట్​ లిస్టులో కోహ్లీ పేరు చేర్చింది.

ప్రస్తుతం భారత క్రికెట్లో కోహ్లీ హవా నడుస్తోంది. టీమిండియా కెప్టెన్​గా మూడు ఫార్మాట్లలోనూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడీ ఆటగాడు. అయితే విరాట్​పై పని భారాన్ని తగ్గించడానికి బంగ్లాదేశ్​తో జరిగే టీ20 సిరీస్​కు విశ్రాంతినిచ్చింది సెలక్షన్ కమిటీ. ఇతడి స్థానంలో రోహిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

కోహ్లీతో పాటు హిట్​లిస్ట్​లో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్,ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్ భగవత్, భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ, రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఉన్నారు.

ఇవీ చూడండి.. బంగ్లా క్రికెటర్ షకిబుల్​పై ఐసీసీ నిషేధం..!

ABOUT THE AUTHOR

...view details