అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త ఛైర్మన్గా న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి ఖవాజాపై మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి.. ఐసీసీకి రెండో స్వతంత్ర్య ఛైర్మన్గా నిలిచారు.
రేసులో ఇద్దరే..
ఐసీసీ ఛైర్మన్ పదవిలో భారత్కు చెందిన శశాంక్ మనోహర్.. తన రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక ఛైర్మన్గా ఖవాజాను నియమించింది ఐసీసీ డైరెక్టర్ల బోర్డు. ఛైర్మన్ ఎన్నికలో భాగంగా కివీస్ క్రికెట్ బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బార్క్లే నామినేషన్ దాఖలు చేయడం.. ఆయనతో పాటు తాత్కాలిక అధ్యక్షుడు ఖవాజా కూడా నామినేషన్ వేయడం వల్ల వీరిద్దరే ఛైర్మన్ పదవికి పోటీపడ్డారు.