తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2020, 9:01 AM IST

Updated : Feb 18, 2020, 8:16 AM IST

ETV Bharat / sports

'కోహ్లీ, రోహిత్​లను చూసి నేర్చుకున్నా'

న్యూజిలాండ్​తో తొలి టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. యువ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్ చివర్లో అర్ధశతకంతో రాణించి, జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్.. పలు విషయాలు పంచుకున్నాడు.

Shreyas Iyer
Shreyas Iyer

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టీ20లో అద్భుత అర్ధశతకంతో జట్టుకు విజయాన్నందించాడు టీమిండియా యువ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్. 29 బంతుల్లో 58 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'​గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్​.. సీనియర్లు కోహ్లీ, రోహిత్​ శర్మలను చూసి చాలా నేర్చుకున్నానని చెప్పాడు.

"సిక్స్​తో జట్టుకు విజయాన్నందించడం చాలా సంతోషాన్నిచ్చింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంది. మైదానం చాలా చిన్నదిగా ఉంది. నాలుగు ఓవర్లలో 50 పరుగులు ఈ గ్రౌండ్​లో చాలా తేలిక. బౌండరీలు కొట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచాలని చూశాం. టీమండియాలో కోహ్లీ, రోహిత్ లాంటి గొప్ప ఆటగాళ్లున్నారు. పినిషింగ్​ ఎలా చేయాలో వారిని చూసి నేర్చుకున్నా"
-శ్రేయస్ అయ్యర్, టీమిండియా క్రికెటర్

టాస్ ఓడి, మొదట బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్ 203 పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియాకు శుబారంభం లభించింది. రాహుల్ (56) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, కోహ్లీ 45 పరుగులతో మెరిశాడు. శ్రేయస్ 58 పరుగులు చేసి, లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఇవీ చూడండి.. టీ20ల్లో తొలిసారి: ఐదుగురు బ్యాట్స్​మెన్ 'హాఫ్​' సెంచరీలు

Last Updated : Feb 18, 2020, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details