తెలంగాణ

telangana

By

Published : Feb 2, 2020, 5:31 AM IST

Updated : Feb 28, 2020, 8:37 PM IST

ETV Bharat / sports

కివీస్​తో ఐదో టీ20... వైట్​వాష్​పై కోహ్లీసేన గురి

న్యూజిలాండ్ గడ్డపై ఆఖరి టీ20లో తలపడేందుకు సిద్ధమౌతోంది కోహ్లీసేన. ఐదు టీ20ల సిరీస్​లో ఇప్పటికే 4-0 ఆధిక్యంలో నిలిచింది భారత్​. ఆఖరి మ్యాచ్​లోనూ గెలిచి కివీస్​ను సొంతగడ్డపై వైట్​వాష్​ చేయాలని ఊవిళ్లూరుతోంది. బే ఓవల్​​ వేదికగా ఇరుజట్లు నేడు పోటీపడనున్నాయి.

New Zealand vs India, 5th T20I: men in blue wish to witewash the kiwis in t20 series
న్యూజిలాండ్​తో ఐదో టీ20... వైట్​వాష్​పై కోహ్లీసేన గురి

న్యూజిలాండ్​లో విజయాల మోత మోగిస్తోన్న భారత జట్టు.. నేడు బే ఓవల్​ మైదానంలో కివీస్​తో ఆఖరి టీ20 ఆడనుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 4-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన... క్లీన్​స్వీప్​ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్​ జట్టు పరువు కాపాడుకునేందుకు తపిస్తోంది.

ర్యాంక్​ లక్ష్యమైతే...

న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ ఇప్పటివరకు టీ20 సిరీస్‌ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది. గతేడాది మూడు మ్యాచ్​ల సిరీస్‌ 1-2తో చేజారింది. అయితే తాజా సిరీస్​లో నాలుగు​ విజయాలు సాధించిన కోహ్లీ సేన.. ఇప్పటికే కివీస్​ గడ్డపై ట్రోఫీ ఖాయం చేసుకుంది. అయితే ఐదు మ్యాచ్​లు గెలిస్తే.. 'మెన్​ ఇన్​ బ్లూ' టీ20 ర్యాంకింగ్స్​లో మరింత ముందుకెళ్తుంది. ఎప్పటినుంచో ఐదో స్థానానికే పరిమితమైన భారత్​.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఒక ర్యాంకు మెరుగుపడి నాలుగోస్థానానికి ఎగబాకొచ్చు.

పంత్​కు అవకాశం...

ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది. నాలుగు మ్యాచ్​లు​ గెలిచి ఊపుమీదున్న భారత జట్టు.. ఈ మ్యాచ్​లో భారీ మార్పులకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్​లో ఓపెనర్​గా బరిలోకి దిగిన సంజు శాంసన్​ ఈ మ్యాచ్​లో రోహిత్​తో కలిసి బరిలోకి దిగే అవకాశముంది. కేఎల్​ రాహుల్​ స్థానంలో పంత్​ రానున్నాడు. వాషింగ్టన్​ సుందర్, జడేజా, శార్దూల్​, మనీశ్​ పాండే తుది జట్టులో పక్కాగా ఉండనున్నారు. చాహల్​ స్థానంలో కుల్దీప్​, బుమ్రా బదులు షమీ జట్టులోకి రానున్నారు.

కివీస్​ ఆత్మవిశ్వాసానికి దెబ్బ...

టీ20 ప్రపంచకప్​ ముంగిట వరుస ఓటములు న్యూజిలాండ్​కు అవమానంగా మారాయి. బౌలింగ్‌ పరంగా ఆ జట్టులో ఇబ్బందులేమీ లేవు. పేసర్లు, స్పిన్నర్లు చక్కగా బంతులు విసురుతున్నారు. కానీ భారత్‌ బ్యాట్స్‌మెన్‌ వారిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు. గత మ్యాచ్​లో ఆడని కేన్​ విలియమ్సన్​ మళ్లీ జట్టులోకి రానున్నాడు. బ్యాట్స్‌మన్‌ టామ్‌ బ్రూస్‌ ఈ మ్యాచ్​లోనూ బరిలోకి దిగే అవకాశముంది.

భారత్ జట్టు (అంచనా)...

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​శర్మ (వైస్​ కెప్టెన్​), సంజు శాంసన్​, కేఎల్​ రాహుల్​/రిషభ్​ పంత్ (కీపర్​)​, వాషింగ్టన్​ సుందర్​, రవీంద్ర జడేజా, కుల్దీప్​/చాహల్,జస్ప్రీత్​ బుమ్రా/మహ్మద్​ షమి, నవదీప్​ సైని, శార్దూల్​ ఠాకూర్​

న్యూజిలాండ్ జట్టు (అంచనా)...

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్‌ బ్రూస్‌, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోదీ, టిమ్ సౌతీ, స్కాట్​ కగ్గిలిన్​, డారెల్​ మిచెల్​/ బ్లెయర్ టిక్నర్/హమీష్ బెన్నెట్

Last Updated : Feb 28, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details