తెలంగాణ

telangana

ETV Bharat / sports

నిలకడగా భారత​ బ్యాటింగ్​.. క్రీజులో శ్రేయస్​, రాహుల్​​​ - కష్టాల్లో భారత్​.. 156 రన్స్​కే 3 వికెట్లు

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్​ రాణిస్తోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా.. 54 పరుగులకే ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్, పృథ్వీషా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. శ్రేయస్​ నిలకడగా బ్యాటింగ్​ కొనసాగిస్తున్నాడు.​

New Zealand vs India, 1st ODI: India lost 3 wickets for 156 runs
భారత్​X న్యూజిలాండ్​: కష్టాల్లో భారత్​.. 156 రన్స్​కే 3 వికెట్లు

By

Published : Feb 5, 2020, 9:51 AM IST

Updated : Feb 29, 2020, 6:05 AM IST

హామిల్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు ఆకట్టుకుంటోంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్​ అగర్వాల్​ 32(31 బంతుల్లో; 6 ఫోర్లు), పృథ్వీ షా 20(21 బంతుల్లో; 3 ఫోర్లు) శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధాటిగా ఆడిన వీరిద్దరూ 4 పరుగుల వ్యవధిలోనే ఔటయ్యారు. గ్రాండ్​హోమ్​ బౌలింగ్​లో పృథ్వీ ఔటవ్వగా... మయాంక్​ సౌథీ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు.

ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, శ్రేయస్​ ఇన్నింగ్స్​ను నడిపించారు. విరాట్​ కెరీర్​లో మరో అర్ధశతకం ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ 51 పరుగులు చేసి వెనుదిరిగాడు. శ్రేయస్​ అయ్యర్​(49*), కేఎల్​ రాహుల్​(7) క్రీజులో ఉన్నారు. 32 ఓవర్లకు భారత జట్టు స్కోరు- 172/3

Last Updated : Feb 29, 2020, 6:05 AM IST

ABOUT THE AUTHOR

...view details