తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​-కివీస్​ మరో 'సూపర్​ ఓవర్'.. మారని ఫలితం

ఆక్లాండ్​ వేదికగా ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ మధ్య జరిగిన చివరి టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. ప్రపంచకప్​ తరహాలోనే ఈ నిర్ణయాత్మక మ్యాచ్​ సూపర్​ ఓవర్​ వరకూ వెళ్లింది. ఈ పోరులో కివీస్​ జట్టు 18 పరుగులు చేయలేక ఇంగ్లీష్​ జట్టు చేతిలో ఓటమిపాలైంది.

By

Published : Nov 10, 2019, 11:23 AM IST

Updated : Nov 10, 2019, 11:39 AM IST

ప్రపంచకప్​లాగే మళ్లీ ఇంగ్లాండ్​-కివీస్​ 'సూపర్​ ఓవర్'

ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్​ ఫైనల్​ను ఇంకా మర్చిపోకముందే మరోసారి అలాంటి పోరు జరిగింది. మెగాటోర్నీ తర్వాత ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టీ20 సిరీస్​లోనూ అదే ఫలితం పునరావృతమైంది. న్యూజిలాండ్​ గడ్డపై జరిగిన ఈ పొట్టి సిరీస్​లో ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది. ఐదు టీ20ల సిరీస్​ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయింది. కీలకమైన ఆఖరి మ్యాచ్​ డ్రాగా ముగియడం వల్ల సూపర్​ ఓవర్​తో ఫలితం తేలింది. మ్యాన్ ఆఫ్​ ద మ్యాచ్​ బెయిర్ స్టో (ఇంగ్లాండ్), మ్యాన్ ఆఫ్ ద సిరీస్​గా సాంటర్న్(కివీస్) నిలిచారు.

ఆక్లాండ్​ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో వర్షం కారణంగా మ్యాచ్​ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో తొలుత బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్​ ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. గప్తిల్​(50), మున్రో(46), టిమ్​ సీఫర్ట్(39) రాణించారు.

లక్ష్య ఛేదనలో 11 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసిన ఇంగ్లాండ్​.. మ్యాచ్​ను డ్రాగా ముగించింది. ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా ఫోర్​ కొట్టాడు క్రిస్ జోర్డాన్​. ఇంగ్లీష్​ ఆటగాళ్లలో బెయిర్​స్టో (47), సామ్ కరన్​(24) ఆకట్టుకున్నారు.

సూపర్​ ఓవర్​ ఇలా...

మ్యాచ్​ డ్రా కావడం వల్ల సూపర్​ ఓవర్​ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ ఓపెనర్లు బెయిర్​స్టో, మోర్గాన్.. సౌథీ బౌలింగ్​లో ​ 1, 6, 1, 6,1, 2 కలిపి మొత్తం 17 పరుగులు చేశారు.

కివీస్ లక్ష్యం 18 పరుగులు. గప్తిల్​, సీఫర్ట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి బంతికి రెండు పరుగులు రాగా తర్వాత బంతి వైడ్​గా వెళ్లింది. తర్వాత రెండు బంతుల్లో 4 పరుగులే వచ్చాయి. అనంతరం నాలుగో బంతికి సీఫర్ట్​ ఔటయ్యాడు. రెండు బంతుల్లో ఇంకా 11 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది.​ ఫలితంగా ఇంగ్లీష్ జట్టు గెలిచింది.

ఇంగ్లాండ్ బ్యాటింగ్​లో చివరి బంతికి ఫోర్​ కొట్టి మ్యాచ్​ డ్రా చేసిన ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ క్రిస్​ జోర్డాన్.. సూపర్​ ఓవర్​లో​ బౌలింగ్​ ద్వారా 8 పరుగులే ఇచ్చి కివీస్ విజయాన్ని అడ్డుకున్నాడు.

ప్రపంచకప్​లోనూ ఇలానే...

ప్రపంచకప్​ ఫైనల్లో తలపడిన కివీస్​, ఇంగ్లాండ్​ జట్లు.. స్కోర్లు సమం కావడం వల్ల సూపర్​ ఓవర్​ ఆడాయి. అందులో ఇంగ్లాండ్​ 16 పరుగులు చేయగా.. న్యూజిలాండ్​ అంతే స్కోరు సాధించి మళ్లీ మ్యాచ్​ను డ్రా చేసింది. అయితే ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది. తాజాగా ఇదే ఫలితం పునరావృతమైంది.

Last Updated : Nov 10, 2019, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details