కరోనా నేపథ్యంలో బంతిపై లాలాజలం, చెమట వాడడంపై ఐసీసీ నిషేధం విధించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బంతికి మెరుపు తెప్పించేందుకు కొత్త పద్ధతులకు అలవాటు పడాల్సిందేనని భారత వెటరన్ పేసర్ ఇషాంత్శర్మ అన్నాడు.
"లాలాజలం, చెమట వాడకపోతే మనం కోరుకున్నట్లుగా బంతి మెరుపు రాదు. కానీ కరోనా కారణంగా వీటిని వాడడంపై నిషేధం ఉంటే కొత్త పద్ధతులకు క్రికెటర్లు అలవాటు పడాల్సిందే" అని ఇషాంత్ చెప్పాడు.