తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవాల్సిందే! - బంతి మెరుపు కోసం ఉమ్మి, చెమట వాడటం నిషేధం

కరోనా కారణంగా క్రికెట్​లో కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యోచిస్తోంది. అందులో బంతికి లాలాజలం, చెమటను వాడడాన్ని నిషేధించాలని ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే బంతి మెరుపు కోసం ప్రత్యామ్నాయ పద్ధతులకు అలవాటు పడాలని టీమ్​ఇండియా ఫాస్ట్​బౌలర్​ ఇషాంత్​ శర్మ అంటున్నాడు.

New methods of ball lightning must be adapted: Ishant Sharma
కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవాల్సిందే!

By

Published : May 19, 2020, 11:31 AM IST

కరోనా నేపథ్యంలో బంతిపై లాలాజలం, చెమట వాడడంపై ఐసీసీ నిషేధం విధించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బంతికి మెరుపు తెప్పించేందుకు కొత్త పద్ధతులకు అలవాటు పడాల్సిందేనని భారత వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌శర్మ అన్నాడు.

"లాలాజలం, చెమట వాడకపోతే మనం కోరుకున్నట్లుగా బంతి మెరుపు రాదు. కానీ కరోనా కారణంగా వీటిని వాడడంపై నిషేధం ఉంటే కొత్త పద్ధతులకు క్రికెటర్లు అలవాటు పడాల్సిందే" అని ఇషాంత్‌ చెప్పాడు.

పాంటింగ్​ స్ఫూర్తి

ఐపీఎల్‌లో దిల్లీ కోచ్‌ పాంటింగ్‌ మాటలు స్ఫూర్తినిచ్చినట్లు ఇషాంత్‌ తెలిపాడు. "గతేడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసినపుడు కొత్త ఆటగాడిలా భావించా. అప్పుడు పాంటింగ్‌ ప్రోత్సాహం అందించడం వల్ల మళ్లీ ఆత్మవిశ్వాసం వచ్చింది" అని ఇషాంత్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి.. అక్టోబర్​లో ఐపీఎల్​: లీగ్​ నిర్వహణకు సన్నాహాలు!

ABOUT THE AUTHOR

...view details