తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లాదేశ్​పై అఫ్గానిస్థాన్ ఘనవిజయం - afghan

ముక్కోణపు టీ-20 సిరీస్​ మూడో మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది అఫ్గానిస్థాన్. మహ్మద్ నబీ(84, 54 బంతుల్లో) అర్ధశతకంతో ఆదరగొట్టి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.

అఫ్గానిస్థాన్

By

Published : Sep 16, 2019, 6:03 AM IST

Updated : Sep 30, 2019, 6:53 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో అఫ్గానిస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టును టెస్టులో ఓడించిన అఫ్గాన్..టీ-20 పోరులోనూ గెలిచింది. ముక్కోణపు టీ-20 సిరీస్​లో భాగంగా ఆదివారం బంగ్లాతో జరిగిన మూడో మ్యాచ్​లో 25 పరుగుల తేడాతో నెగ్గింది. 84 పరుగులతో విజృంభించిన అఫ్గాన్ బ్యాట్స్​మన్ మహ్మద్ నబీకి 'మ్యాన్​ ఆఫ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. నబీతో పాటు అస్గార్ అఫ్గాన్(40) రాణించాడు. బంగ్లా బౌలర్లలో మహ్మద్ సైఫుద్దీన్ 4 వికెట్లతో చక్కటి ప్రదర్శన చేశాడు.

అనంతరం 165 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బౌలర్ ముజీబ్ రెహ్మన్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. బంగ్లా బ్యాట్స్​మెన్​ మహ్మదుల్లా(44), సబ్బీర్ రెహ్మన్(24) ఫర్వాలేదనిపించారు.

ఇదీ చదవండి: యాషెస్ సిరీస్ డ్రా.. చివరి టెస్టులో ఇంగ్లాండ్ విజయం

Last Updated : Sep 30, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details