టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ దేవల్ సాహే(73) అనారోగ్య సమస్యలతో మంగళవారం మృతి చెందారు. ఆయన శరీరంలోని అన్ని అవయవాలు పాడైపోవడం వల్ల తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభినవ్ ఆకాశ్ సాహే వెల్లడించారు.
ధోనీ మెంటార్ అనారోగ్యంతో మృతి - dhoni mentor deval sahay died
మాజీ కెప్టెన్ ధోనీ మార్గనిర్దేశకుడు దేవల్ సాహే(73) అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని సాహే కుమారుడు వెల్లడించారు.
![ధోనీ మెంటార్ అనారోగ్యంతో మృతి dhoni](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9647785-849-9647785-1606210547112.jpg)
ధోనీ
సాహే గతంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేశారు. ఆయనకు ఓ భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహీని.. తన స్వగ్రామం రాంచీలో తొలిసారి టర్ఫ్ పిచ్లపై ఆడటం నేర్పించారు. అనంతర కాలంలో ధోనీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, ఎన్నో ఘనతల్ని సాధించాడు.
ఇదీ చూడండి : 'ధోనీని ఆటపట్టిస్తా.. జీవా వినేది అతడి మాటలే'